Andhra Pradesh: రాప్తాడులో పీక్స్‌కు చేరిన రాజకీయం.. గన్నుతో బెదిరించినా చర్యలు తీసుకోరా అంటూ..

|

Aug 29, 2022 | 5:40 PM

Andhra Pradesh: రాప్తాడులో రాజకీయ రచ్చ పీక్స్‌ కి చేరింది. తాజాగా కిడ్నాప్ పాలిటిక్స్ అగ్గిరాజేశాయి. పరిటాల, తోపుదుర్తి వర్గాల మధ్య ఇప్పుడు..

Andhra Pradesh: రాప్తాడులో పీక్స్‌కు చేరిన రాజకీయం.. గన్నుతో బెదిరించినా చర్యలు తీసుకోరా అంటూ..
Paritala
Follow us on

Andhra Pradesh: రాప్తాడులో రాజకీయ రచ్చ పీక్స్‌ కి చేరింది. తాజాగా కిడ్నాప్ పాలిటిక్స్ అగ్గిరాజేశాయి. పరిటాల, తోపుదుర్తి వర్గాల మధ్య ఇప్పుడు పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. వైసీపీ నాయకుల అరాచకాలు హెచ్చు మీరిపోతున్నాయని మండి పడ్డారు మాజీ మంత్రి పరిటాల సునీత. రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి తుపాకీతో తమ కార్యకర్తలను బెదిరించినా, వారిపై పోలీసులు తూతూ మంత్రంగా కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. నామమాత్రపు కేసులు నమోదు చేసి, చేతులు దులుపుకున్నారని, పోలీసులు తమ గౌరవాన్ని కాపాడుకోవాలని సునీత అన్నారు. వైసీపీ నుంచి తెలుగు దేశం పార్టీలోకి స్వచ్ఛందంగా చేరేందుకు వస్తున్న వారిని అడ్డుకొని, గన్నుతో బెదిరించి విచక్షణ రహితంగా దాడి చేసిన ఎమ్మెల్యే సోదరుడు రాజశేఖర్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పరిటాల శ్రీరామ్‌.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..