టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుపతి, చిత్తూరు పర్యటనను అడ్డుకున్న పోలీసులు, ఎయిర్ పోర్ట్ లో భీష్మించుకుని నేలపై కూర్చున్న చంద్రబాబు
మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులపై దాడులు, అక్రమ కేసులకు వ్యతిరేకంగా చంద్రబాబు నిరసన ప్రయత్నంను పోలీసులు భగ్నం చేశారు. ఈ ఉదయం 11:30కి చిత్తూరులో గాంధీ విగ్రహం ఎదుట, సాయంత్రం 4 గంటలకు తిరుపతిలో గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టాల్సిన చంద్రబాబును ఏపీ పోలీసులు అడ్డుకున్నారు.
Updated on: Mar 01, 2021 | 2:54 PM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి తిరుపతి, చిత్తూరు పర్యటనను అడ్డుకున్న పోలీసులు. ఎయిర్ పోర్ట్ లో భీష్మించుకుని నేలపై కూర్చున్న చంద్రబాబు. 144 సెక్షన్, ఎన్నికల కోడ్ అమలులో ఉందని చంద్రబాబుకి నోటీసులు జారీ చేసిన పోలీసులు, ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుందని సైతం అడ్డుకున్న వైనం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకుని వెనక్కి వెళ్లాలని కోరుతోన్న దృశ్యం. చంద్రబాబుతో పాటు అతని పీఏ, వైద్యాధికారి ఫోన్లను తీసేసుకున్న పోలీసులు

కలెక్టర్ తో పాటు, తిరుపతి, చిత్తూరు ఎస్పీలను కలిసి, తన పర్యటనను అడ్డుకోవడంపై వినతి పత్రం ఇస్తానని పోలీసులకు చంద్రబాబు నాయుడు మొర. అయితే, అధికారులను కలిసేందుకు కూడా పోలీసులు అనుమతిని నిరాకరణ. దీంతో అనుమతి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిన చంద్రబాబు నాయుడు. అనుమతి ఇచ్చేవరకు తాను బైఠాయించిన ప్రాంతం నుంచి కదలబోనంటూ పోలీసులతో చంద్రబాబు పట్టు. రాష్ట్రంలో ఓ ప్రతిపక్ష నేతగా కలెక్టర్, ఎస్పీలను కలిసే హక్కు కూడా తనకు లేదా? అంటూ మండిపాటు.

గతంలో జగన్ అడ్డుకున్న దానికి, ఇప్పుడు తమ అధినేత చంద్రబాబుని అడ్డుకున్న తీరుపై తెలుగుదేశంపార్టీ వివరణ