Andhra Pradesh: వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలి.. దాతలకు చంద్రబాబు పిలుపు

గోదావరి (Godavari) వరదలతో సర్వం కోల్పోయిన వారికి సహాయం చేయాలని దాతలను టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) కోరారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. బాధితులను...

Andhra Pradesh: వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలి.. దాతలకు చంద్రబాబు పిలుపు
Chandrababu
Follow us

|

Updated on: Jul 30, 2022 | 5:24 PM

గోదావరి (Godavari) వరదలతో సర్వం కోల్పోయిన వారికి సహాయం చేయాలని దాతలను టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) కోరారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఆరోపించారు. వారికి తమ వంతు సహాయంగా దాతలు ముందుకు వచ్చి కూరగాయలు, బియ్యం దానం చేయాలని కోరారు. రూపాయి రూపాయి కూడబెట్టుకున్న సొమ్మంతా వరదల్లో కొట్టుకుపోయిందని, తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నిస్సహాయ స్థితిలో సహాయం కోసం అర్థిస్తున్నారని చెప్పారు. మేత లేక పశువులు, కూరగాయలు, బియ్యం లేక జనం దుర్భర స్థితిలో కట్టుబట్టలతో మిగిలారని పేర్కొన్నారు. ఇళ్లలోకి బురద చేరి వస్తువులు పాడయ్యాయని, వారిని సమాజంతో పాటు మానవతావాదులు, దాతలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు ముందడుగు వేయాలని కోరారు. పశువులకు ఎండుగడ్డి కొరత ఏర్పడిందని, వాటికి పచ్చిగడ్డితో పాటు ఎండుగడ్డినీ అందించాలని దాతలను అభ్యర్థించారు.

కాగా.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఫ్యాన్ స్విచ్ బంద్ చేసి, సైకిల్ కు అధికారంలోకి తీసుకురావాలని కోరారు. అలా చేస్తే నే బాధితులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. కేసుల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడతున్నారని, పోలవరం ఆలస్యానికి ఏపీ ప్రభుత్వమే కారణమని కేంద్రం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేనని చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేసి, నిర్వాసితులకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని చంద్రబాబు వెల్లడించారు.

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..

ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..