తుళ్లూరులో ప్రారంభమైన వైసీపీ నూతన కార్యాలయం

|

Aug 28, 2020 | 6:17 PM

అమరావతిలో కీలకమైన తుళ్లూరులోనే వైసీపీ ఆఫీస్‌ ప్రారంభమైంది. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించారు. రాజధాని ఇక్కడే ఉండాలని రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలోనే..

తుళ్లూరులో ప్రారంభమైన వైసీపీ నూతన కార్యాలయం
Follow us on

YSRCP office in Thulluru : అమరావతిలో కీలకమైన తుళ్లూరులోనే వైసీపీ ఆఫీస్‌ ప్రారంభమైంది. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించారు. రాజధాని ఇక్కడే ఉండాలని రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ వైసీపీ ఆఫీస్‌ మొదలు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తొలుత కొందరు ఎమ్మెల్యేను అడ్డుకుంటారనే ప్రచారం జరిగింది. అయితే ఎలాంటి గొడవ లేకుండానే… ఈ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.

ఈ సందర్భంగానే టీడీపీ తీరుపై విమర్శలు చేశారు ఎమ్మెల్యే శ్రీదేవి. రైతులు, రైతు కూలీల ముసుగులో కొందరు టీడీపీ వాళ్లు ధర్నాలు చేస్తున్నారని కామెంట్‌ చేశారు. CRDA రద్దు జరిగినా… తాము మాత్రం కౌలు డబ్బులను, పెన్షన్‌ను అందిచామని  చెప్పుకొచ్చారు శ్రీదేవి.