AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: అమ్మా, నాన్న గుర్తురాలేదా బ్రో.. యువతి రిప్లే ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్య!

విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. రెండు నెలల క్రితం పరిచయమైన ఓ అమ్మాయి తన మెసేజ్‌లకు రిప్‌లేలు ఇవ్వడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Andhra News: అమ్మా, నాన్న గుర్తురాలేదా బ్రో.. యువతి రిప్లే ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్య!
Vizianagaram Youth Suicide
Anand T
|

Updated on: Aug 22, 2026 | 8:38 AM

Share

రెండు నెలల క్రితం పరిచయమైన ఓ అమ్మాయి తన మెసేజ్‌లకు రిప్‌లేలు ఇవ్వడం లేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయిన విషాదం ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాదిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పారాది గ్రామానికి చెందిన చిన్నమ్మ, బోడయ్యకు కొడుకు, కూతురు ఉన్నారు. కూతురికి ఇప్పటికే వివాహం కాగా కుమారుడు పున్నాన శేఖర్‌ 10th క్లాస్ వరకు చదివి విజయవాడలోని ఓ ఫర్నీచర్‌ షాప్‌లో పనిచేస్తున్నాడు. అయితే ఉపాధి కోసమని తల్లిదండ్రులు చెన్నై వెళ్లగా శేఖర్ ఇక్కడే ఉంటున్నాడు.

అయితే గత జూన్‌ నెలలలో తన సోదరి అయిన లత ఇంట్లో శుభకార్యం ఉండడంతో శేఖర్ అక్కడికి వెళ్లాడు. ఆ పంక్షన్‌లో శేఖర్‌కు ఓ ఆమ్మాయితో పరిచయం ఏర్పడింది. దీంతో ఒకరి సోషల్ మీడియా అకౌంట్‌లు ఒకరు తెలుసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా మెసేజ్‌లు చేసుకునేవారు. అయితే వారం పాటు అక్క ఇంటి దగ్గరే ఉన్న శేఖర్ తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఎప్పటిలాగే సోషల్ మీడియాలో అమ్మాయికి మెసేజ్ చేశాడు. కానీ ఏం జరిగిందో తెలియదు.. సడెన్‌గా శేఖర్ మెసేజ్‌లకు అమ్మాయి రిప్‌లే ఇవ్వడం ఆపేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

రెండు రోజుల పాటు అమ్మాయి నుంచి ఎలాంటి మెసేజ్‌లు రాకపోయే సరికి తీవ్ర మనస్తాపానికి గురైన శేఖర్ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. అయితే గురువారం రాత్రి స్నేహితులతో సరదాగా గడిపిన శేఖర్ శుక్రవారం ఉదయం ఎంత కొట్టినా తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన బంధువు తలుపులు బద్దలకొట్టి చూడగా.. శేఖర్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. అది చూసి షాకైన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
2 నెలల పరిచయానికే ప్రాణం తీసుకోవాలా?.. యువతి రిప్లే ఇవ్వలేదని
2 నెలల పరిచయానికే ప్రాణం తీసుకోవాలా?.. యువతి రిప్లే ఇవ్వలేదని
రెండో టెస్టుకు ముందు లంక జట్టులో 2 మార్పులు.. ఎందుకో తెలుసా?
రెండో టెస్టుకు ముందు లంక జట్టులో 2 మార్పులు.. ఎందుకో తెలుసా?
పీఎఫ్ అకౌంట్లో వడ్డీ ఎప్పుడు ఆగిపోతుంది.. ఈపీఎఫ్ఓ రూల్స్ ఇవే..
పీఎఫ్ అకౌంట్లో వడ్డీ ఎప్పుడు ఆగిపోతుంది.. ఈపీఎఫ్ఓ రూల్స్ ఇవే..
42 నిమిషాల్లో 22 బంతులు వేసి 5 వికెట్లు.. ఇది ఆల్ టైమ్ రికార్డ్
42 నిమిషాల్లో 22 బంతులు వేసి 5 వికెట్లు.. ఇది ఆల్ టైమ్ రికార్డ్
యమహా నుంచి అదిరిపోయే అప్‌డేట్స్: 2026 హైబ్రిడ్ స్కూటర్లు ఇవే
యమహా నుంచి అదిరిపోయే అప్‌డేట్స్: 2026 హైబ్రిడ్ స్కూటర్లు ఇవే
నీలిరంగు పూలతో నల్లమల అడవికి కొత్త అందం..
నీలిరంగు పూలతో నల్లమల అడవికి కొత్త అందం..
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త ఎడిషన్ విడుదలకు కారణమిదే
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త ఎడిషన్ విడుదలకు కారణమిదే
7 ఏళ్లప్పుడు బతుకు తెరువు కోసం వలస.. నేడు చరిత్ర తిరగరాసింది!
7 ఏళ్లప్పుడు బతుకు తెరువు కోసం వలస.. నేడు చరిత్ర తిరగరాసింది!
'టాక్సిక్‌' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం.. టికెట్ల ధరల వివరాలివే
'టాక్సిక్‌' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం.. టికెట్ల ధరల వివరాలివే
కుమారుడి కారు ప్రమాద ఘటనపై స్పందించిన ఎంపీ లింగమనేని రమేష్
కుమారుడి కారు ప్రమాద ఘటనపై స్పందించిన ఎంపీ లింగమనేని రమేష్