మిస్‌ టీన్‌ గ్లోబ్‌ ఇండియా కిరీటం దక్కించుకున్న చంద్రగిరి యువతి

|

Jul 21, 2023 | 8:49 AM

జాతీయ స్థాయిలో నిర్వహించిన అందాల పోటీల్లో రాష్ట్రానికి చెందిన యువతి మెరిసింది. జులై 16న జైపూర్‌లో జరిగిన ‘మిస్‌ టీన్‌ గ్లోబ్‌ ఇండియా-2023’ పోటీల్లో చంద్రగిరికి చెందిన సంజన మిస్‌ టీన్‌ గ్లోబ్‌ ఇండియా కిరీటం..

మిస్‌ టీన్‌ గ్లోబ్‌ ఇండియా కిరీటం దక్కించుకున్న చంద్రగిరి యువతి
Sanjana
Follow us on

చంద్రగిరి, జులై 21: జాతీయ స్థాయిలో నిర్వహించిన అందాల పోటీల్లో రాష్ట్రానికి చెందిన యువతి మెరిసింది. జులై 16న జైపూర్‌లో జరిగిన ‘మిస్‌ టీన్‌ గ్లోబ్‌ ఇండియా-2023’ పోటీల్లో చంద్రగిరికి చెందిన సంజన మిస్‌ టీన్‌ గ్లోబ్‌ ఇండియా కిరీటం దక్కించుకుంది.

2023 మే నెలలో బెంగళూరులో ప్రిలిమినరీ రౌండ్‌లో 300 మందికి పైగా టీనేజ్‌ యువతులు జూమ్‌ కాల్‌ ద్వారా పోటీలో పాల్గొన్నారు. వీరిలో ఫైనల్స్‌కు 57 మంది ఎంపికయ్యారు. వారిలో సంజన కూడా ఉంది. ఇక ఈ నెల 16 నుంచి జైపూర్‌లో జరిగిన గ్రాండ్‌ ఫైనల్‌లో 47 మంది పాల్గొన్నారు. వారిలో సంజన మొదటి స్థానంలో నిలిచి కిరీటం కైవసం చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆమె తల్లిదండ్రులు గురువారం మీడియాకు తెలిపారు. కాగా సంజన చంద్రగిరి మాజీ ఎంపీటీసీ అల్లతూరు మోహన్‌ మనమరాలు కావడం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.