
నెయ్యి.. ఇంత ఆజ్యం పోస్తుందని ఎవరూ ఊహించలేదు. కార్యకర్తలకు ఈ రేంజ్లో బీపీ వస్తుందనీ అనుకోలేదు. అసలు ఇంత ఉద్రిక్తతకి కారణం.. మాట పెట్టిన మంట. ఆ మాటను అన్వయించుకోవడంలో వచ్చిన తంటా. అంబటి రాంబాబు అన్నది చంద్రబాబునే, రాజ్యహింసను ప్రోత్సహించేంత ‘అనుచిత వ్యాఖ్యే’ అంటోంది టీడీపీ. నిజమేగా.. అది అనకూడని మాటేగా అని సపోర్ట్ చేస్తున్నాయి జనసేన-బీజేపీ. లేదు లేదు.. అన్నది చంద్రబాబుని కాదు అని స్వయానా అంబటినే క్లారిటీ ఇచ్చారు. ఓవైపు అంబటి వివరణ, ఈ ఘర్షణ జరుగుతుండగానే.. జోగి నుంచి కూడా అలాంటి ‘అనుచిత వ్యాఖ్యే’ వచ్చిందనే రగడ మొదలైంది టీడీపీ నుంచి. అందులో అభ్యంతరకరమైన మాటేముందనే సమర్ధన వైసీపీది. ఈ మొత్తం ఎపిసోడ్లో ఏది అనుచితం, ఏది సముచితం అనే చర్చ జరుగుతోంది. మాటామాటా అనుకున్నంత వరకు ఓకే. అనుచితమా, సముచితమా అనే రగడ వరకూ ఓకే. కాని, ఏకంగా ఇళ్లపై దాడుల వరకూ వెళ్లిందే..! చూస్తున్న వాళ్లంతా ఏంటిదంతా అని అనుకుంటుండగానే.. టాపిక్ ‘సామాజికవర్గాల’ వైపు వెళ్లింది. ఇప్పుడిదే లేటెస్ట్ వర్షన్ కూడా. ఇది ‘కాపు-బీసీ సామాజికవర్గాలపై జరుగుతున్న దాడి’ అని ప్రతిపక్షం అంటుంటే.. మరీ వ్యక్తికి-మొత్తం సామాజికవర్గానికి ముడిపెట్టడమేంటి అంటోంది టీడీపీ. తిరుమల నెయ్యి వివాదంపై ఓ రిపోర్ట్ ఇచ్చింది సీబీఐ-సిట్. నెయ్యిలో జంతువుల కొవ్వే లేదని సీబీఐ తేల్చింది చూశారా అంటూ పాప ప్రక్షాళన కార్యక్రమానికి దిగింది వైసీపీ. కొవ్వు కలవలేదని ఎవరు చెప్పారు,...