
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి భూములు, ఇళ్లు ఇచ్చిన రైతులకు ఒకసారి ఉచిత విమాన ప్రయాణం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. దీనికి స్పందించిన జీఎంఆర్ సంస్థ రైతులను ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తీసుకెళ్లేందుకు అంగీకరించింది. శంషాబాద్ విమానాశ్రయం నిర్మాణానికి ముందు, తర్వాత అక్కడ చోటుచేసుకున్న అభివృద్ధిని ప్రత్యక్షంగా చూపించి, భోగాపురం ప్రాంత భవిష్యత్ అభివృద్ధిపై రైతులకు అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి భూములు, ఇళ్లు ఇచ్చిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గౌరవం కల్పించింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారిని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించి, ప్రధానమంత్రి ఆసీనులయ్యే సభావేదికకు ఎదురుగా ఏర్పాటు చేసిన వీవీఐపీ గ్యాలరీలో వారికి ప్రత్యేక స్థానాలు కేటాయించింది. భోగాపురం మండలంలోని గూడెపువలస, రావాడ, కంచేరు, కవులువాడ, ఎ. రావివలస, సవరవిల్లి, ముంజేరు గ్రామాలకు చెందిన 403 మంది భూములు ఇచ్చిన రైతులు, 1,600 మంది ఇళ్లు ఇచ్చిన కుటుంబాలు, అలాగే పొలం, ఇల్లు రెండూ ఇచ్చిన 200 మంది ఈ గౌరవానికి అర్హులయ్యారు.
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి లక్షలాదిగా ప్రజలు హాజరుకానుండటంతో విశాఖ జిల్లా నుంచి 1,465 బస్సులు, అనకాపల్లి జిల్లా నుంచి 500 బస్సులు ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ఇప్పటికే 140 బస్సుల్లో గిరిజన విద్యార్థులు, కళాకారులను తరలించగా, మరో 46 బస్సుల్లో 11 మండలాల ప్రజలను తీసుకువస్తున్నారు. నియోజకవర్గాల వారీగా జీవీఎంసీ అధికారులు, జోనల్ కమిషనర్లు, తహసీల్దార్లను ఇన్చార్జ్లుగా నియమించారు. అనకాపల్లి, భీమిలి, ఈస్ట్, సౌత్, నార్త్, గాజువాక నియోజకవర్గాల నుంచి ప్రత్యేక మార్గాల ద్వారా భోగాపురానికి బస్సులు నడుపుతున్నారు. సభ అనంతరం ప్రజలు సురక్షితంగా తిరిగి వెళ్లేలా రవాణా, వివిధ ప్రాంతాల్లో భోజన ఏర్పాట్లు కూడా అధికారులు పకడ్బందీగా చేశారు.
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ షెడ్యూల్ను ప్రకటించింది. ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 24 వరకు అమల్లో ఉండే షెడ్యూల్ను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రతిరోజూ హైదరాబాద్–భోగాపురం మధ్య ఐదు సర్వీసులు, విజయవాడ–భోగాపురం మధ్య నాలుగు సర్వీసులు, బెంగళూరు–భోగాపురం మధ్య రెండు సర్వీసులు నడపనుంది. అదనంగా, శుక్రవారం మినహా మిగిలిన రోజుల్లో భోగాపురం–బెంగళూరు మధ్య మరో అదనపు సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. కొత్త విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్రకు విమాన కనెక్టివిటీ మరింత బలోపేతం కానుందని అధికారులు భావిస్తున్నారు.
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం నేపథ్యంలో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీగా ప్రజలు, వీవీఐపీలు హాజరుకానుండటంతో విశాఖలో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించగా, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సిటీ పోలీసులు సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేస్తూ, భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. మరోవైపు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోనూ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ప్రజలను భోగాపురానికి తరలించేందుకు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ స్కూల్ బస్సులను వినియోగిస్తున్నారు. బస్సులకు జీపీఎస్ ఏర్పాటు చేసి, వాటి కదలికలను పర్యవేక్షించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు.
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. జిల్లా సరిహద్దులోనే ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం జరగడంతో ప్రారంభోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. దీంతో శ్రీకాకుళం–భోగాపురం మార్గమంతా సందడిగా మారింది. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజల కోసం జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉచిత బస్సు సౌకర్యంతో పాటు అల్పాహారం, భోజన ఏర్పాట్లు కల్పించింది. ప్రయాణికుల కోసం బస్సుల్లో వాటర్ బాటిళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు తదితర స్నాక్స్ను కూడా అందుబాటులో ఉంచి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది.
భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక ప్రాజెక్ట్ అని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు. అయితే భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా హైదరాబాద్, తిరుపతి, విజయవాడ వంటి కీలక మార్గాల్లో విమాన సర్వీసులను విశాఖ ఎయిర్పోర్ట్ నుంచే నిర్వహించాలని సూచించారు. అవసరమైతే జీఎంఆర్ యూడీఎఫ్ ఛార్జీలు వసూలు చేసుకోవచ్చని, ప్రతిదీ వాణిజ్య కోణంలో చూడకూడదన్నారు. భోగాపురానికి పూర్తి స్థాయి రోడ్డు కనెక్టివిటీ ఏర్పడే వరకు విశాఖ విమానాశ్రయ సేవలు కొనసాగించాలని మరోసారి ప్రభుత్వాన్ని కోరారు.
తాజా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంతో… ఏపీలో కనెక్టివిటీ, పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధికి మరో కీలక అడుగు పడిందని కేంద్రం చెబుతోంది. దీంతో మోదీ పర్యటనలు రాష్ట్ర రాజకీయాలతో పాటు అభివృద్ధి చర్చల్లోనూ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.
2022లో విశాఖ పర్యటన సందర్భంగా రూ.10,500 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రైల్వే, రోడ్లు, పోర్టు, పెట్రోలియం, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన పలు పనులకు శ్రీకారం చుట్టారు. విశాఖను బ్లూ ఎకానమీ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యమని అప్పుడే ప్రకటించారు.
2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోదీ… తాజా భోగాపురం పర్యటనతో కలిపి సుమారు 15 సార్లు ఆంధ్రప్రదేశ్ను సందర్శించారు. కేంద్ర పథకాల ప్రారంభోత్సవాలు, అభివృద్ధి ప్రాజెక్టులు, ఎన్నికల ప్రచారం, అధికారిక కార్యక్రమాల కోసం ఆయన రాష్ట్రానికి వచ్చారు. ఈ పర్యటనల్లో విశాఖపట్నానికే అత్యధిక ప్రాధాన్యం దక్కింది. ఇప్పటివరకు సుమారు 5 సార్లు విశాఖను సందర్శించిన మోదీ… నేవీ ఫ్లీట్ రివ్యూ, ఈస్టర్న్ నేవల్ కమాండ్ కార్యక్రమాలు, పెట్టుబడుల సదస్సులు, మౌలిక వసతుల ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీకి ఏపీతో ప్రత్యేక అనుబంధం కొనసాగుతోంది. ముఖ్యంగా విశాఖపట్నానికి పలుమార్లు వచ్చి కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.
భోగాపురం పర్యటనకు ప్రధాని మోదీ షెడ్యూల్
ఉ.10:45కి భోగాపురం ఎయిర్పోర్ట్కు మోదీ రాక
ఉ.10:50-10:55 టెర్మినల్ భవనానికి చేరిక
ఉ.10:55-10:58 కూచిపూడి నృత్యంతో స్వాగతం
ఉ.11:00-11:15 ఎయిర్పోర్ట్ నిర్మాణ పనుల పరిశీలన
ఉ.11:17-11:25 ఓపెన్టాప్ జీప్లో సభా వేదికకు మోదీ
ఉ.11:30-12:55 ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం, ప్రసంగం
మ.1:05కి భోగాపురం నుంచి ఢిల్లీకి ప్రధాని మోదీ
ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభ సభ ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. మూడు లక్షల మంది హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం ప్రత్యేకంగా, చిరకాలంగా గుర్తిండిపోయేలా సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు.
భోగాపురం వాసులు ఆనందాన్ని అక్షరాల రూపంలో అద్భుత ప్రకృతి సొగసులతో ఈ స్వాగతం సిద్ధం చేశారు. వారి ఆనందాన్ని 30 వేల మొక్కలతో అక్షరాల రూపం ఇచ్చారు. దీనికి సుమారు వారం రోజులు పాటు 70 మంది పని చేశారు. ఈ 30 వేల మొక్కల్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో బన్నింగ్ భుష్ గడ్డి మొక్కలు జపాన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ గడ్డి బాగా కనిపించేందుకు డార్క్ కలర్ మొక్కలు చుట్టుపక్కల ఏర్పాటు చేశారు. ప్రధాని విమానం ల్యాండ్, టేకాఫ్ సమయంలో ఈ అపురూప స్వాగతం కనిపించాలనే ముఖ్య ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశారు
భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని మోదీకి వినూత్నంగా స్వాగతం పలికేందుకు 30 వేల మొక్కలు సిద్ధమయ్యాయి. ప్రకృతి సొగసులతో ప్రధానికి సరికొత్త అనుభూతిని కలిగించనున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం ఏపీ ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో భారీ ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా ప్రధాని మోదీకి భోగాపురం వాసులు వినూత్న స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. ఎయిర్ పోర్ట్ ప్రారంభ వేడుక వస్తున్నా ప్రధాని మోదీకి విమానం నుంచే కనిపించే విధంగా 30 వేల మొక్కలతో WELCOME.. PM MODI JI, CM CBN JI అని రాశారు. ఇప్పటివరకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు ఈ తరహా స్వాగతం లభించలేదనే చెప్పాలి.
ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నమైన.. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహాఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఇప్పటికే ముందస్తు ఇనాగరేషన్ వేడుకలతో ఉత్తరాంధ్ర ఊగిపోతోంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర అంతటా సంబరాలు అంబరాన్నంటాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా కనీవినీ ఎరుగనిరీతిలో ఏర్పాట్లుచేసింది రాష్ట్రప్రభుత్వం.
విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవవేళ సోషల్ మీడియాలో కీలక పోస్ట్ చేశారు ప్రధాని మోదీ. దేశ మౌలిక వసతుల్లో భోగాపురం విమానాశ్రయం ఒక బిగ్గెస్ట్ బూస్ట్ అన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ద్వారా.. పర్యాటకం, వాణిజ్యం అభివృద్ధి చెందుతుందని.. వికసిత భారత్ లక్ష్యానికి మరింత బలం చేకూరుకుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పోస్ట్పై స్పందించిన సీఎం చంద్రబాబు.. స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామంటూ రిప్లై ఇచ్చారు. భోగాపురం ఎయిర్పోర్టుతో అభివృద్ధిలో ఉత్తరాంధ్ర టేకాఫ్ తీసుకుంటుందన్నారు సీఎం చంద్రబాబు.
ప్రధాని మోదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు భారీ ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రారంభోత్సవ సభకు 3 లక్షల మంది వస్తారన్న అంచనా 5వేల బస్సులు ఏర్పాటు చేశారు. అలాగే, 7వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. భోగాపురంలో ప్రధాని మోదీ ల్యాండైన తర్వాత 13వేల మందికిపైగా గిరిజన బాలికల థింసా నృత్యంతో స్వాగత ఏర్పాట్లుచేసింది ప్రభుత్వం. ఈ థింసా నృత్యానికి ఇప్పటికే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అందుకున్నారు మంత్రి సంధ్యారాణి.
శనివారం (ఆగస్టు 01) ఉదయం పదకొండున్నర తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు ప్రధాని మోదీ. ఉదయం 10:45కి భోగాపురం ఎయిర్పోర్ట్కి చేరుకుని.. 10:55 వరకు టెర్మినల్ని పరిశీలిస్తారు. పదకొండూ 17 నిమిషాలకు ఓపెన్టాప్ జీప్లో ర్యాలీగా బయల్దేరి పది నిమిషాల్లో సభా వేదిక దగ్గరకు చేరుకుంటారు. పదకొండున్నర తర్వాత ఎయిర్పోర్ట్ను ప్రారంభించి, మాట్లాడతారు ప్రధాని. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైనా.. పూర్తిస్థాయి ఆపరేషన్స్ మాత్రం ఆగస్ట్ 17 నుంచి మొదలుకానున్నాయ్. ఆరోజు నుంచే భోగాపురం గగనతలంలో విమానాల మోత మోగనుంది.
భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం.. ప్రధాని మోదీ రాక సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని విశాఖవాసులకు సూచించారు. మూడు ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నారు. భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
https://www.youtube.com/watch?v=NTqa4XRZqZI