Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జనసేన జయకేతనం సభకు భారీ ఏర్పాట్లు! సభకు వచ్చిన వారందరికీ..

జనసేన జయకేతనం సభకు భారీ ఏర్పాట్లు! సభకు వచ్చిన వారందరికీ..

SN Pasha

|

Updated on: Mar 14, 2025 | 3:55 PM

పిఠాపురం చిత్రాడలో జరుగుతున్న జనసేన పార్టీ యొక్క "జయకేతనం" సభకు విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. 250 మంది సామర్థ్యం కలిగిన వేదిక, ప్రత్యేక గ్యాలరీలు, భోజన వసతులు ఏర్పాటు చేయబడ్డాయి. భారీ పోలీసు బందోబస్తుతో పాటు, సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ కూడా జరుగుతుంది.

పిఠాపురం చిత్రాడలో జరుగనున్న జనసేన జయకేతనం సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం 4 గంటలకు సభ ప్రారంభంకానుంది. అదే సమయానికి జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సభాప్రాంగణానికి చేరుకోనున్నారు. 250 మంది కూర్చునేలా సభా వేదిక, ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సభా ప్రాంగణం దగ్గర ఆల్రెడీ హడావిడి మొదలైపోయింది. పిఠాపురం చిత్రాడకు జనసేన శ్రేణులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. సభకు వస్తున్న వాళ్లందరికీ భోజన సదుపాయాలు, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తున్నారు. అయితే ఎండతాపంతో కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు మండుటెండలోనే విధులు నిర్వహిస్తున్నారు పోలీసులు. సభ వద్ద ఏకంగా 1,700 మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో పర్యవేక్షణ 250 మంది కూర్చునేలా సభా వేదిక, ప్రత్యేక గ్యాలరీలు సభా ప్రాంగణంలో 15 ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు.