Andhra: పెళ్లై 40 రోజులే.. ఇంతలోనే ఏం జరిగింది..?

విశాఖలో నవవధువు అనుమానాస్పద మృతి కలకలం రేపింది. పెళ్లైన కేవలం 40 రోజులకే కృష్ణవేణి ఇంట్లో విగతజీవిగా కనిపించింది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు చెబుతుండగా, పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ..

Andhra: పెళ్లై 40 రోజులే.. ఇంతలోనే ఏం జరిగింది..?
Krishna Veni

Updated on: Jun 25, 2026 | 1:55 PM

విశాఖలో నవవధువు అనుమానాస్పద మృతి కలకలం రేపింది. పెళ్లై కేవలం 40 రోజులు మాత్రమే అయిన యువతి కృష్ణవేణి తన నివాసంలో విగతజీవిగా కనిపించడం తీవ్ర విషాదానికి దారితీసింది. కుటుంబ సభ్యులు ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెబుతుండగా, ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విజయనగరం జిల్లా మెంటాడ గ్రామానికి చెందిన కృష్ణవేణికి ఇటీవల వివాహం జరిగింది. పెళ్లి అనంతరం భర్తతో కలిసి విశాఖలో నివాసం ఉంటోంది. ఘటన జరిగిన రోజు భర్త విధులకు వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఉన్న కృష్ణవేణి ఉరికి వేలాడుతున్న స్థితిలో కనిపించినట్లు సమాచారం. విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన భర్త ఈ దృశ్యాన్ని చూసి వెంటనే స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువతి మృతికి గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు నమోదు చేయడంతో పాటు, అవసరమైన ఆధారాలను సేకరిస్తున్నారు.

పెళ్లైన కొద్దిరోజులకే నవవధువు మృతి చెందడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది నిజంగా ఆత్మహత్యేనా, లేక మరేదైనా కారణం ఉందా అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us