AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: టిఫిన్ చేసి వస్తానని ఇంట్లో నుంచి వెళ్లాడు.. తెల్లారేసరికి శవమై వచ్చాడు.. ఇంతలో ఏం జరిగిందంటే..

Andhra Pradesh: గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. టిఫిన్ చేసి వస్తానన్న తనయుడు.. తెల్లారేసరికి విగతజీవిగా తిరిగొచ్చాడు. అది చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.

Andhra Pradesh: టిఫిన్ చేసి వస్తానని ఇంట్లో నుంచి వెళ్లాడు.. తెల్లారేసరికి శవమై వచ్చాడు.. ఇంతలో ఏం జరిగిందంటే..
Shiva Prajapati
|

Updated on: Feb 23, 2022 | 11:23 PM

Share

Andhra Pradesh: గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. టిఫిన్ చేసి వస్తానన్న తనయుడు.. తెల్లారేసరికి విగతజీవిగా తిరిగొచ్చాడు. అది చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. టిఫిన్ చేసి వస్తానని సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన కొడుకు మరుసటిరోజు ఉదయం శవమై రావడం.. ఆ గ్రామంలో తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల్లోకెళితే.. జిల్లాలోని రాజుపాలెం మండలం పెదనెమలిపురికి చెందిన నవీన్ గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు. నిన్న సాయంత్రం ఇంటికి వచ్చిన నవీన్ టిఫిన్ చేసి వస్తానని వెళ్ళాడు. రాత్రి ఎనిమిదిన్నర కి ఫోన్ చేసి నకరికల్లులో ఉన్నాయని చెప్పాడు. తర్వాత పదకొండున్నరకి ఫోన్ చేసి కొండమోడులో ఉన్నానని నాయనమ్మ ఇంటికి వెళ్తానని చెప్పాడు. అయితే తెల్లవారేసరికి బ్రాంచ్ కెనాల్ వద్ద నవీన్ శవమై కనిపించాడు. గుర్తుతెలియని వ్యక్తులు ముఖంపై రాళ్ళతో దాడి చేసినట్లు ఆనవాళ్ళున్నాయి‌. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు ఎవరిపై అనుమానం లేదని చెబుతుండగా వివాహేతర సంబంధమే హత్యకు కారణమై ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.

Also read:

UP Election 2022: యూపీలో ప్రశాంతంగా ముగిసిన నాలుగో విడత పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే..

Gold Silver Price: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన పసిడి ధరలు.. పూర్తివివరాలివే..

TDP: సామాన్యులకు శ్రీవారిని దూరం చేస్తున్నారు.. టీటీడీ పాలక మండలి తీరుపై పయ్యావుల విమర్శలు..