జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ విద్యాసంస్థ యాజమాని దుర్మరణం!

కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలం బొమ్మలూరు (కల్లపరు) టోల్‌గేట్ సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం (జూలై 28) తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో రాజమండ్రికి చెందిన ప్రముఖ విద్యాసంస్థ యజమాని నున్న సురేష్ (52) మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ కారు రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అత్యంత వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ విద్యాసంస్థ యాజమాని దుర్మరణం!
Bommaluru Toll Gate Road Accident

Updated on: Jul 28, 2026 | 7:46 AM

కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలం బొమ్మలూరు (కల్లపరు) టోల్‌గేట్ సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం (జూలై 28) తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో రాజమండ్రికి చెందిన ప్రముఖ విద్యాసంస్థ యజమాని నున్న సురేష్ (52) మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ కారు రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అత్యంత వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

సమాచారం ప్రకారం, నున్న సురేష్ తన కుటుంబ సభ్యులు నున్న విమల దేవితో కలిసి హైదరాబాద్ నుంచి రాజమండ్రికి కారులో బయలుదేరారు. బొమ్మలూరు టోల్‌గేట్ సమీపానికి చేరుకోగానే ముందుగా నిలిపి ఉన్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, సురేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రమాదంలో నున్న విమల దేవికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us