Kurnool district: పీర్ల పండగలో అపశృతి: అగ్నిగుండంలో పడ్డ వ్యక్తి.. అందరూ చూస్తుండగానే కాలిపోయాడు

కర్నూలు జిల్లా- అవుకు మండలంలోని- సుంకేసుల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మొహర్రం సందర్భంగా...

Kurnool district: పీర్ల పండగలో అపశృతి: అగ్నిగుండంలో పడ్డ వ్యక్తి.. అందరూ చూస్తుండగానే కాలిపోయాడు
Man Brunt Alive

Updated on: Aug 20, 2021 | 1:38 PM

కర్నూలు జిల్లా- అవుకు మండలంలోని- సుంకేసుల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మొహర్రం సందర్భంగా వేసిన అగ్ని గుండంలో వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి ప్రమాదవశాత్తూ పడ్డాడు. మంటల్లో చిక్కినవాడు చిక్కినట్టే ఉండిపోయాడు.. ఎట్టి పరిస్థితుల్లోనే అతడు బయటకు రాలేక పోయాడు. స్థానికులు అతడ్ని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఒంటి నిండా మంటలంటుకుని అక్కడిక్కడే కాలి బొగ్గయిపోయాడు. అప్పటికీ అతడ్ని అతి కష్టం మీద బయటకు తీసి.. ఆస్పత్రికి తరలించినా.. ఆ సరికే అతడి ప్రాణాలు కోల్పోయాడు. వెంకట సుబ్బయ్య పూటుగా మందు కొట్టి ఈ మంటల్లోకి దిగాడని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే పీర్ల పండగను తెలుగు రాష్ట్రాల్లో హిందూ, ముస్లింలు సోదరభావంతో ఘనంగా జరుపుకుంటారు. మొహర్రం సందర్భంగా అగ్ని గుండాలు ఏర్పాటు చేయడం.. ఒక ఆచారంగా వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయనీ.. వీటి పట్ల జనం జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు పోలీసులు.

విజయనగరం జిల్లాలో దారుణం.. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడువాడలో దారుణం జరిగింది. యువతిపై ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డుకోబోయిన యువతి అక్క, ఆమె కుమారుడికి.. గాయాలయ్యాయి. ముగ్గురినీ విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు.  నిందితుడు నరవకు చెందిన రాంబాబుగా గుర్తించారు. రాంబాబు, ఆ యువతి గత కొన్ని రోజులుగా లవ్‌లో ఉన్నారు. ఇరు కుటుంబాలు కూడా వీరి పెళ్లికి అంగీకరించాయి. అయితే ఇటీవల ఆ యువతి వేరే యువకుడితో మాట్లాడుతోందంటూ రాంబాబు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి రెండు కుటుంబాలను పిలిచి పోలీసులు రాజీ కుదిర్చారు. పోలీసుల సూచనతో వివాహం చేసుకునేందుకు యువకుడు సమ్మతించాడు. ఆ తర్వాత నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఆ గ్రామం నుంచి పరారయ్యాడు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

Also Read: విజయవాడ రాహుల్ హత్య కేసులో కోగంటి సత్యం పేరు.. అతడి నేరాలు, ఘోరాలు తెలిస్తే షాకే

ఈ ఏడాది బంగారం, వెండి రాఖీలకు పెరిగిన డిమాండ్.. మార్కెట్‌లో సరికొత్త రాఖీ డిజైన్లు..

 

Loading...
Unable to load recommendations.
Follow Us