AP News: ఆయ్ ‘రామలు’ సీజన్ వచ్చేసిందండీ.. టేస్ట్‌లో పులసతో పోటీ..

అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ మొదటి వారంలోపు మాత్రమే రామలు లభిస్తాయి. సాధారణంగా చేపలలో ఉండే చేదు కట్టును తీశాక వంట చేస్తారు. కానీ ఆరోగ్య ప్రయోజనాల దృశ్య.. రామలను చేదు కట్టుతోనే కూర వండుతారు.

AP News: ఆయ్ రామలు సీజన్ వచ్చేసిందండీ.. టేస్ట్‌లో పులసతో పోటీ..
Ramalu Fish

Updated on: Nov 03, 2024 | 2:59 PM

పులస చేప తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గోదావరికి వరదనీరు వచ్చినప్పుడు జాలర్లకు చిక్కే ఈ చేపలు.. వారి దండిగా కాసులను అందిస్తాయి. జులై నుంచి అక్టోబర్‌ వరకు పులసలు చిక్కుతూ ఉంటాయి. రుచితో పాటు ఎన్నో పోషక విలువలు ఈ చేప సొంతంపల్లెటూర్లలో ఎవరైనా పులస.. కొని వండుకున్నారంటే..  ఊరంతా ఆ విషయాన్ని ఆ రోజు గొప్పగా చెబుతుంటారు. అది పులస రేంజ్. ఇక పులస మాదిరిగానే.. గోదావరి జిల్లాల్లో  ‘రామ చేప’ కూడా చాలా పాపులర్. వీటికి కూడా మంచి డిమాండ్ ఉంటుంది. రామ చేపలు చూడటానికి బొమ్మిడాయిలు మాదిరిగానే ఉంటాయి. టేస్ట్ అయితే పులసల లాగానే ఉంటుందట. ఈ చేపలు 5 నుంచి 7 అంగుళాలు ఉంటాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉప్పుటేరు పరివాహక ప్రాంతాల్లో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ చేపల లభ్యత ఉంటుంది.

Also Read: ఆ కాపరికి చెందిన నాలుగు గొర్రెలు మిస్సింగ్.. వాటి కోసం వెతుకుతుండగా.. నిర్మానుష్య ప్రదేశంలో

రామల చేపలు..  కిలోకు 40 వరకు తూగుతాయి. కానీ వీటిని పీస్‌ల లెక్క అమ్ముతూ ఉంటారు. సాధారణంగా రామలు ధర ఒక్కోటి రూ.25 వరకు ఉంటుంది. కానీ ప్రారంభ సీజన్‌లో ఒక్కోటి రూ.30కు పైనే పలుకుతుంది. డిమాండ్‌ను బట్టి ఒక్కోసారి రూ.40 నుంచి రూ.50 పలుకుతుంది. ఈ చేపలను మన దగ్గర తినడమే కాకుండా..  కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేస్తారు. మసాలా దట్టించి ఇగురు పెట్టినా.. ఇదే సీజన్‌లో కాసే లేత చింతకాయలతో కలిపి పులుసు పెట్టినా.. ఆ రుచి అమోఘం అంటున్నారు మాంసాహార ప్రియులు. చింతకాయలతో కలిపి వీటిని కూర వండితే ఆ వాసన ఊరి పొలిమేర దాటాల్సిందేనట.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..