NTR District: ఆ కాపరికి చెందిన నాలుగు గొర్రెలు మిస్సింగ్.. వాటి కోసం వెతుకుతుండగా.. నిర్మానుష్య ప్రదేశంలో
నందిగామ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిమెట్ల గ్రామానికి సమీప ప్రాంతాల్లో ఎన్నో దశాబ్దాలుగా వజ్రాల అన్వేషణ కొనసాగుతుంది. సంవత్సరం పొడవునా సాగే వజ్రాల వేటకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వస్తుంటారు. కానీ ఈ సారి వాటి కోసం ఏకంగా క్షుద్రపూజల వరకు వెళ్లడం కలకలం రేపుతోంది.
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల వజ్రాలగుట్ట దగ్గర క్షుద్రపూజల కలకలం చెలరేగింది. మేకను బలిచ్చి పూజలు చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. తమ వ్యాపారం పెరగాలంటూ పేపర్పై రాసి పూజలు చేయడం చర్చనీయాంశమైంది. కొన్నేళ్లుగా గుడిమెట్లలో వజ్రాల కోసం వెదుకులాట కొనసాగుతుంది. తాజాగా ఇలా క్షుద్ర పూజలు చేసి మరీ.. వజ్రాల కోసం వేటాడుతుండటంతో స్థానికులు భయపడుతున్నారు.
తన 3 మేకలు మూడు రోజులుగా కనిపించడం లేదంటూ నాగరాజు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాటి కోసం వెదుకుతుండగా తన మేకలనే బలిచ్చినట్లుగా ఆనవాళ్లు కనిపించాయని అంటున్నాడు నాగరాజు. నాగరాజు ఫిర్యాదుపై క్షుద్రపూజలు జరిగిన ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్
శ్రీ వాసవీ మాతకు 102 ఋషి గోత్ర నామాలతో భారీ రుద్రాక్ష మాల సమర్పణ
పాల డబ్బాలో ఇరుక్కున్న తల.. ! రీల్స్ కోసం కష్టాలు..
స్వేచ్ఛ కోసం ఓ కుటుంబం సుదీర్ఘ పోరాటం.. చివరకు..
భార్య కోసం సర్వస్వం అర్పించిన భర్త కన్నీటి గాథ

