Pawan kalyan: పవన్‌కు జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ కల్పించండి.. ప్రధాని మోడీకి లేఖ రాసిన కాపు సంక్షేమ సేన

పవన్‌పై ఏ చిన్న దాడి జరిగినా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుంది. రాబోయే ఎన్నికల దృష్ట్యా ప్రచారంలో ముందు ఉండే పవన్ కల్యాణ్ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆయనకు జెడ్ ప్లస్‌ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలి' అని లేఖలో పేర్కొన్నారు చేగొండి హరిరామజోగయ్య.

Pawan kalyan: పవన్‌కు జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ కల్పించండి.. ప్రధాని మోడీకి లేఖ రాసిన కాపు సంక్షేమ సేన
Pawan Kalyan, Chegondi

Updated on: Nov 10, 2022 | 6:42 AM

జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌కు జెడ్‌ ప్లస్‌ కేటగరి సెక్యూరిటీ కల్పించాలని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ ఎంపీ చేగొండి హరి రామజోగయ్య ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు. రాష్ట్రంలో మాస్ ఫాలోయింగ్ ఉన్న పవన్‌ను అంతమొందించేందుకు రెక్కీలు నిర్వహిస్తున్నారని, అందుకే ఆయన భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చేగొండి ఈ లేఖలో కోరారు. ‘రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్, మంత్రుల అండదండలతో వైసీపి గూండాలు ప్రతిపక్ష నాయకులపై దాడులకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో మాస్ ఫాలోయింగ్ ఉన్న పవన్‌ను అంతమొందించేందుకు కొందరు రెక్కీలు నిర్వహిస్తున్నారు. పవన్‌ పై ఏ చిన్న దాడి జరిగినా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుంది. రాబోయే ఎన్నికల దృష్ట్యా ప్రచారంలో ముందు ఉండే పవన్ కల్యాణ్ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆయనకు జెడ్ ప్లస్‌ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలి’ అని లేఖలో పేర్కొన్నారు చేగొండి హరిరామజోగయ్య.

కాగా ఇటీవల హైదరాబాద్ లోపవన్ కల్యాణ్ ఇంటి వద్ద కొందరు అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నారన్న వార్తలు సంచలనం సృష్టించాయి. వారు గత కొన్ని రోజులుగా పవన్‌ ఇంటి వద్ద రెక్కీ నిర్వహిస్తున్నారని, పవన్‌కు భద్రత పెంచాలని జనసేన పార్టీ నాయకులు కోరుతున్నారు. విశాఖలో ఘర్షణలు జరిగినప్పటి నుంచి పవన్‌ను అనుసరిస్తూ అనుమానాస్పద వాహనాలు తిరుగుతున్నాయని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈనేపథ్యంలో పవన్‌కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేస్తూ పలువురు కేంద్ర హోంశాఖకు లేఖలు రాస్తున్నారు. అలా తాజాగా కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య ప్రధాని మోడీకి లేఖ రాశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us