Yellow Frogs: వర్షాకాలం రాగానే రంగు మార్చే కప్పలు.. దీని వెనక ఉన్న సైన్స్ ఏంటో తెలుసా? పెద్ద కథే..

సాధారణంగా వర్షాకాలం ప్రారంభంలో మనకు పసుపు రంగు కల్పలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి కనిపిస్తే వర్షాకాలం ప్రారంభం అయినట్టేనని చాలా మంది నమ్ముతారు. ఇలాగే కైకలూరులో పసుపు రంగు కప్పలు ప్రత్యక్షమై సందడి చేశాయి. నార్మల్‌ ఆడ కప్పలను ఆకర్షించడానికి మగ కప్పలు రంగులు మారుస్తుంటాయి. కానీ ఈ వింత వెనుక సైన్స్ దాగి ఉందని మీకు తెలుసా? అయితే అది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Yellow Frogs: వర్షాకాలం రాగానే రంగు మార్చే కప్పలు.. దీని వెనక ఉన్న సైన్స్ ఏంటో తెలుసా? పెద్ద కథే..
Yellow Frogs Kaikaluru

Edited By:

Updated on: Jul 02, 2026 | 12:18 PM

ప్రకృతి ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. తాజాగా ఏలూరు జిల్లా కైకలూరు ప్రాంతంలో అలాంటి ఒక వింతే వెలుగుచూసింది. సాధారణంగా గోధుమ , పచ్చ రంగులో ఉండే కప్పలు.. ఒక్కసారిగా మెరిసిపోయే పసుపు రంగులోకి మారి ప్రత్యక్షమవడంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. వీటిని పలువురు తమ కెమెరాల్లో బంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ చేస్తున్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఏలూరు జిల్లా కైకలూరు టౌన్‌హాల్ గ్రౌండ్‌లోకి భారీగా నీరు చేరింది. ఆ నీటిలో నుంచి అకస్మాత్తుగా పసుపు రంగులో మెరుస్తున్న కొన్ని కప్పలు బయటకు వచ్చాయి. ఈ వింత జీవులను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే ఈ కప్పల శాస్త్రీయ నామం ‘హూప్లోచాట్రాసస్ టైగిరినస్’. వీటిని సాధారణంగా ఇండియన్ బుల్ ఫ్రాగ్’అని పిలుస్తారు. మన తెలుగు ప్రాంతాల్లో వీటిని తవుడు కప్పలు లేదా బోదరు కప్పలు అని కూడా పిలుస్తుంటారు. ఇవి దాదాపు 17 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతాయి.

కప్పలు పసుపు రంగులోకి ఎందుకు మారాయి?

కప్పలు రంగు మారటం వెనుక వింత, దైవిక అద్భుత ఏమి లేదని వెటర్నరీ అధికారులు చెబుతున్నారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన జీవశాస్త్ర లక్షణం ఉందంటున్నారు. కేవలం వర్షాకాలంలో జతకట్టే సమయంలో మాత్రమే మగ కప్పలు తమ శరీరాన్ని ఇలా ప్రకాశవంతమైన పసుపు రంగులోకి మార్చుకుంటాయని చెబుతున్నారు. ఆడ కప్పలను ఆకర్షించేందుకే ప్రకృతి వీటికి ఈ శక్తిని ఇచ్చిందని అంటున్నారు.అంతే కాదు ఈ మగ కప్పలు శబ్దాలు చేసేటప్పుడు వాటి గొంతు భాగంలో ఉండే రెండు స్వరపేటికలు నీలం రంగులోకి మారుతూ వింత శబ్దాలు చేస్తాయి. వర్షాకాలం ముగిసి, జతకట్టే ప్రక్రియ పూర్తి కాగానే ఇవి మళ్లీ తమ పాత సాధారణ రంగులోకి వచ్చేస్తాయని అధికారులు చెబుతున్నారు.

ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా కనిపించే ఈ ఇండియన్ బుల్ ఫ్రాగ్స్ సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. చెరువులు పూడిపోవడం, కాలుష్యం పెరగడం వల్ల వీటి ఉనికి ప్రమాదంలో పడుతోందని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us