Andhra Pradesh-Janasena: ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై స్పందించిన జనసేనాని.. ఏమన్నారంటే..

|

Nov 19, 2021 | 9:40 PM

Andhra Pradesh-Janasena: ఆంధ్రప్రదేశ్ ‌అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్రజాప్రతినిధుల కుటుంబ

Andhra Pradesh-Janasena: ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై స్పందించిన జనసేనాని.. ఏమన్నారంటే..
Pawan Kalyna
Follow us on

Andhra Pradesh-Janasena: ఆంధ్రప్రదేశ్ ‌అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులను కించపరచటం తగదన్నారు. ఈ మేకు పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలో సారాంశం యధావిధంగా.. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంటున్న రాజకీయ వైపరిత్యాలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయి. ఒకపక్క వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం అవుతుంటే.. ప్రజాప్రతినిధులు ఇవేమీ పట్టనట్లు ఆమోదయోగ్యం కాని విమర్శలు, వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. తన భార్యను కించపరిచారని, ఆమె గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే విధంగా మాట్లాడారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టడం బాధాకరం. ఇలాంటి ఘటనలు సామాన్యులకు రాజకీయ వ్యవస్థపై ఏహ్యభావం కలిగించే ప్రమాదం ఉంది.’’

‘‘ఈ మధ్యకాలంలో సభలు, సమావేశాలు, చివరికి టీవీ చర్చలలో కొన్నిసార్లు వాడుతున్న పదజాలం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఉంటోంది. ప్రతిపక్ష నేత కుటుంబ సభ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత శోచనీయం. ఈ వ్యాఖ్యలు నిర్హేతుకంగా ఖండించదగినవి. గతంలో జగన్ కుటుంబ సభ్యులను దూషించినప్పుడు కూడా ఇదే విధంగా ఖండించాను. ముఖ్యంగా ఆడపడుచుల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు మరింత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మహిళలను కించపరచడం, వారి గౌరవ ప్రతిష్టలకు హానీ కలిగించడాన్ని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇటువంటి దిగజారుడు రాజకీయాలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ఇది ఒక అంటు వ్యాధిలా అంతటా ప్రబలే ప్రమాదం ఉంది. రాజకీయ వ్యవస్థను ప్రజల దృష్టిలో పలుచన చేయొద్దు.’’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు.

Also read:

Shalu Chourasiya: కీలక మలుపులు తిరిగిన హీరోయిన్ శాలు చౌరాసియా కేసు.. నిందితుడిన పట్టుకున్న పోలీసులు

Suriya: ఆచార్యకు పోటీగా సూర్య సినిమా… థియేటర్లలో ఒకేరోజు సందడి చేయనున్న స్టార్ హీరోస్…

Bigg Boss 5 Telugu: ప్రేక్షకులకు ఎమోషనల్ టచ్ ఇస్తున్న ఆ ఇద్దరు.. డెస్టినీ వాళ్లను కలిపిందంటున్న నెటిజన్స్…