
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తల్లికి వందనం అనే పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రభుత్వ స్కూల్లలో చదివే అర్హులైన విద్యార్థులకు ఏడాకి రూ.15వేల రూపాయలను ప్రభుత్వం అందజేస్తుంది. ఈ నిధుల్లో రూ.13 వేల విద్యార్థుల తల్లి ఖాతాలో నేరుగా జమ చేస్తుండగా.. మరో రూ.2వేలు స్కూల్ ఖాతాలో వేయనుంది.
అయితే వేసవి సెలవులు ముగిసి మల్లీ స్కూల్స్ ఓపెన్ అవ్వడంతో ఇప్పుడు విద్యార్థులకు ఈ నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకానికి మీరు అర్హులా కాదా అనేది తెలుసుకోవడానికి ప్రభుత్వం ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అవును లబ్ధిదారులు https://bm-sgsw.ap.gov.in/BM /Schemeout వెబ్ సైట్ను సందర్శించి మీరు అర్హులా కాదా అనేది తెలుసుకోవచ్చు. అదెలానో క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ఇక్కడ తెలుసుకోండి.
అధికారిక వెబ్సైట్ ద్వారా స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా
ఆఫ్లైన్లో ఇలా…
ఒకవేళ మీకు ఆన్లైన్లో చెక్ చేయడం వీలుపడకపోతే, మీ గ్రామంలోని గ్రామ , వార్డ్ సచివాలయానికి వెళ్లి డిజిటల్ అసిస్టెంట్ ద్వారా లేదా మీ పిల్లలు చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించి కూడా మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.