ఏవోబీలో టెన్షన్ టెన్షన్.. మావోల కోసం గాలింపు..

| Edited By:

Jul 22, 2020 | 2:05 PM

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న ప్రాంతం.. మావోయిస్టుల సంచారంతో ఉలిక్కిపడింది. ఆదివారం నాడు లండోలు అటవీ ప్రాంతంలో..

ఏవోబీలో టెన్షన్ టెన్షన్.. మావోల కోసం గాలింపు..
Follow us on

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న ప్రాంతం.. మావోయిస్టుల సంచారంతో ఉలిక్కిపడింది. ఆదివారం నాడు లండోలు అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే ఈ ఘటనలో ఎవరు కూడా ప్రాణాలు కోల్పోలేదు. అయితే పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో పలువురు మావోయిస్టులు గాయపడ్డట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో ఉన్న రక్తపు మడుగుల గుర్తులను పసోలీసులు గుర్తించారు. అంతేకాదు.. ఆ ప్రాంతంలోనే పేలుడు పదార్థాలతో పాటుగా మావోయిస్టులు ఉపయోగించే వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌ జరిగిన సమయంలో పలువురు మావోయిస్టు కీలక నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తప్పించుకున్న మావోయిస్టుల కోసం గత రెండు రోజులుగా విస్తృతంగా కూంబింగ్ జరుగుతోంది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.