గుడ్ఫ్రైడే సందర్భంగా గుంటూరులో శిలువ పాత్ర ధారితో ప్రదర్శన నిర్వహించారు. పేరేచర్లలోని చర్చి ప్రాంగణంలో ఫాదర్ బాల ఏసు సందేశాన్ని భక్తులకు వినిపించారు. క్షమా గుణమే ఏసు క్రీస్తు పరిచర్య అని ప్రజలందరూ శాంతి సమాధానం కలిగి ఉండాలని హితవు చెప్పారు. ఏసు క్రీస్తు శిలువ వేయబడి మరణించిన రోజునే గుడ్ ఫ్రైడే జరుపుకుంటారని ఫాదర్ బాల తెలిపారు. అన్ని గుణాలకన్నా క్షమా గుణం గొప్పదన్నారు ఫాదర్ బాల. క్రీస్తు జీవితం, బోధనలు అందరికీ ఆదర్శనీయమన్నారు.