AP News: ఏపీలో ఘోర ప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు దుర్మరణం.. మరో ఇద్దరికి

|

May 28, 2022 | 10:07 AM

అందరూ నిద్రిస్తుండగా.. గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడు ధాటికి ఇంటిపైనున్న మిద్దె కుప్పకూలింది. దీంతో శిథిలాల కింద చిక్కుకున్న ఆరుగురు చిక్కుకున్నారు.

AP News: ఏపీలో ఘోర ప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు దుర్మరణం.. మరో ఇద్దరికి
Gas Cylinder Explosion
Follow us on

Gas cylinder explosion: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు దుర్మరణం చెందారు. మరికొంతమందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన జిల్లా (anantapur) లోని సెట్టూరు మండలం ములకలేడు గ్రామంలో జరిగింది. అందరూ నిద్రిస్తుండగా.. శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడు ధాటికి ఇంటిపైనున్న మిద్దె కప్పు కుప్పకూలింది. దీంతో శిథిలాల కింద ఆరుగురు చిక్కుకున్నారు.

భారీ శబ్దం రావడంతో అక్కడికి చేరుకున్న గ్రామస్తులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఉన్న ఆరుగురిని బయటకు తీశారు. అప్పటికే నలుగురు మరణించగా.. మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోటీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

ఇవి కూడా చదవండి

మృతులు బైనాభి, దాదు, సర్పున్ని, బేబీ (3) గా గుర్తించారు. గాయాలైన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించనున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..