
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో ప్రాంతాల పేర్లు మార్పుపై ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. తమ ప్రాంతం పేరు మార్చవద్దంటూ కోనసీమ వాసులు చేపట్టిన ఆందోళనలు రాష్ట్రంలో కాక పుట్టించాయి. కోనసీమ జిల్లా పేరును అంబేడ్కర్ జిల్లాగా మార్చవద్దంటూ చేసిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు వ్యంగ్యంగా ట్వీట్(Twitter) చేశారు. ఆంధ్రప్రదేశ్ పేరును ‘వైఎస్సార్ ప్రదేశ్’గా మార్చాలని గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్కు నా విన్నపమంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. తెలుగు(Telugu) ను ఓ తెగులుగా భావించి దాన్ని పీకి పారేస్తున్నాం కాబట్టి.. రాష్ట్రానికి వైఎస్ఆర్ ల్యాండ్ అని ఇంగ్లీష్ పేరు పెడితే మరీ భేషుగ్గా ఉంటుంది…’ అని ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఈ ట్వీట్ సంచలనంగా మారింది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పేరును “వైయస్సార్ ప్రదేశ్” గా మార్చమని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి నా విన్నపం.?
ఇవి కూడా చదవండిమరో మాట:
తెలుగును ఓ తెగులుగా భావించి దానిని పీకి పార వేస్తున్నాం కాబట్టి, రాష్ట్రానికి “YSR Land” అనే ఇంగ్లీషు పేరు పెడితే మరీ భేషుగ్గా ఉంటుంది.— M. Nageswara Rao IPS(R) (@MNageswarRaoIPS) May 25, 2022
మరోవైపు.. అమలాపురంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. మంగళవారం జరిగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకుని ఘటనకు కారకులెవరు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పలువురు పరారీలో ఉండడంతో అందుబాటులో ఉన్నవారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో అలజడికి ఆస్కారం లేదన్న అంచనాకు వచ్చే వరకు నిఘా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. రావులపాలెంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. వ్యాపారసంస్థలు తెరచుకున్నాయి. ప్రధాన కూడళ్లలో బందోబస్తు కొనసాగించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి