
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు దీవిలోని పాశర్లపూడి, పాశర్లపూడి లంక, అప్పనపల్లి, పెదపట్నం లంక, బి.దొడ్డవరం, సఖినేటిపల్లిలంక, అప్పన్న రామునిలంక, రామరాజులంక లాంటి పలు లంక గ్రామాలు నదీ తీరం వెంబడి ఉన్న సారవంతమైన భూములు, పచ్చని కొబ్బరి చెట్లు నదీ గర్భంలో కలిసిపోతున్నాయి. ఇప్పటికే వేలాది ఎకరాలు కొబ్బరి తోటలు, లక్షలాది కొబ్బరి చెట్లు గోదావరిలో కలిసిపోతున్నా.. ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక కొబ్బరి చెట్టు నాటిన దగ్గర నుంచి కాపు కాయడానికి ఐదు ఏళ్లు సమయం పడుతుందని.. ఇలా కాపు కాసే సమయానికి కొబ్బరి చెట్లు కళ్ళఎదుటే నదీ గర్భంలో కలిసిపోవడం రైతుకు కంటనీరు తెప్పిస్తున్నాయి. తక్షణం ప్రభుత్వాలు స్పందించి గోదావరి నది తీరం వెంబడి గ్రొవెన్స్ నిర్మాణం చేపట్టాలని సారవంతమైన కొబ్బరి తోటలు నదీ గర్భంలో కలిసిపోకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు బాధిత రైతులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి