Srikakulam: ప్రాణం తీసిన నిద్రమత్తు.. కల్వర్టును బలంగా ఢీ కొట్టిన కారు.. తండ్రీ కుమారులు మృతి..

|

Nov 14, 2022 | 7:14 AM

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకొచ్చిన కారు జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జి సైడ్ వాల్ ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న తండ్రీ కుమారులిద్దరూ మృతి చెందారు...

Srikakulam: ప్రాణం తీసిన నిద్రమత్తు.. కల్వర్టును బలంగా ఢీ కొట్టిన కారు.. తండ్రీ కుమారులు మృతి..
Road Accident In Srikakulam
Follow us on

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకొచ్చిన కారు జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జి సైడ్ వాల్ ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న తండ్రీ కుమారులిద్దరూ మృతి చెందారు. నందిగాం మండలం పెద్దనాయుడుపేట వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వైజాగ్ నుంచి పలాసకు వెళ్తున్న ఓ వ్యక్తి వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. అతను తన కుటుంబంతో కలిసి పలాస వైపు వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు కల్వర్టును బలంగా ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న పలాస ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేష్ తో పాటు అతడి కుమారుడు సంకల్ప్ అక్కడికక్కడే మృతి చెందారు.

ఆయన భార్య ప్రసన్న లక్ష్మి, కుమార్తె సైర్య కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమయ్యారు. పోలీసులు, వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తీసుకెళ్లారు. నిద్రమత్తులో ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..