బ్రేకింగ్.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు మోగిన నగారా..

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలకు నగారా మోగింది. పంచాయితీ, జెడ్పీటీసీ సహా మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 21న తొలిదశ, 24న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 27న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇక 29వ తేదీన కౌంటింగ్‌తో పాటు.. అదే రోజు ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఏపీలో 13 వేలకు పైగా గ్రామపంచాయితీలు.. లక్షా 35 వేలు పంచాయితీ వార్డులు ఉన్నాయి. ఇక జిల్లా […]

బ్రేకింగ్.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు మోగిన నగారా..

Edited By:

Updated on: Mar 06, 2020 | 4:25 PM

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలకు నగారా మోగింది. పంచాయితీ, జెడ్పీటీసీ సహా మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 21న తొలిదశ, 24న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 27న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇక 29వ తేదీన కౌంటింగ్‌తో పాటు.. అదే రోజు ఫలితాలు కూడా వెలువడనున్నాయి.

ఏపీలో 13 వేలకు పైగా గ్రామపంచాయితీలు.. లక్షా 35 వేలు పంచాయితీ వార్డులు ఉన్నాయి. ఇక జిల్లా పరిషత్‌లు 13 ఉండగా.. జడ్పీటీసీలు 660, మండల పరిషత్‌లు 660 ఉండగా.. మండల పరిషత్ స్థానాలు 10,800 ఉన్నాయి.

 

Follow Us