Andhra: సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తికి ఏదో మెరుస్తూ కనిపించింది.. దగ్గరకెళ్లి చూడగా కళ్లు జిగేల్

మనం అలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు.. ఏదైనా వస్తువు లేదా పర్స్ లాంటివి దొరికితే.. మనలో ఉన్న సెల్ఫిష్ దాన్ని కచ్చితంగా తీసుకోమని చెబుతుంది. మనం అది వేరేవాళ్ళకు కూడా ఇవ్వం. అలాంటిది ఇక్కడ ఓ వ్యక్తి తనకు రోడ్డు మీద దొరికిన పర్స్‌ను..

Andhra: సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తికి ఏదో మెరుస్తూ కనిపించింది.. దగ్గరకెళ్లి చూడగా కళ్లు జిగేల్
Representative Image

Edited By:

Updated on: Dec 24, 2025 | 2:01 PM

కాకినాడ జిల్లా జగ్గంపేటలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన సైకిల్ మెకానిక్ వర్కర్ కడారి రాజు మంగళవారం రాత్రి జగ్గంపేట జేవియర్ జంక్షన్ మీదుగా పెట్రోల్ బంక్ పక్కన సర్వీస్ రోడ్‌లో ఉన్న తన సైకిల్ మెకానిక్ షాప్‌కు వెళ్తున్నాడు. అలా వెళ్తుండగా జేవియర్ జంక్షన్ వద్ద ఒక పర్సు దొరికింది. అందులో సుమారు 50 వేల రూపాయలు నగదు ఉండడంతో జగ్గంపేట పోలీస్ స్టేషన్‌లో అందజేశాడు. దీంతో జగ్గంపేట ఎస్సై రఘునాథరావు నగదు ఎవరివి అనే దానిపై విచారణ చేపట్టారు.

జేవియర్ జంక్షన్ సీసీ ఫుటేజ్, దొరికిన పర్సులోని ఐడెంటీ ప్రూఫ్‌లను పరిశీలించి, ఆ పర్సు గోకవరం రోడ్డుకు చెందిన బోర్ వెల్స్ రాంబాబుదిగా గుర్తించారు. దీంతో పర్సను, పర్సులో ఉన్న నగదును ఎస్ఐ రఘునాథరావు చేతుల మీదుగా నగదు పోగొట్టుకున్న బాధితుడు రాంబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా నిజాయితీ చాటుకుని దొరికిన నగదును స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి బాధితుడికి అందజేసిన కడారి రాజును ఎస్ఐ రఘునాధరావు శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.