
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీపీ నేత అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ పడింది. అంబటిని రాజమండ్రి జైలుకు తరలించారు పోలీసులు . వరుస ఘటనలతో ఏపీ రాజకీయం అంతకంతకూ హీటెక్కుతోంది. తాజా పరిణామాలపై సీఎం చంద్రబాబు ఘాటుగా ట్వీట్ చేశారు.రాజకీయాలను నేరాల వైపు నడిపిన సంస్కృతి వైసీపీదేనన్నారు. వైసీపీ పాలనంతా చట్ట రహితంగానే కొనసాగిందన్నారు.అలాంటి పరిస్థితులకు 2024లో ముగింపు పలికామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మళ్లీ రూల్ ఆఫ్ లా అమలు అవుతోందన్నారు సీఎం చంద్రబాబు.
ప్రజల సాధికారతే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వైసీపీ గతంలో చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్నారు.దాంతో ఆ పార్టీ నిరాశతో అసహనంతో వుందన్నారు. ఏపీ పునర్ నిర్మాణాన్ని చూసి వైసీపీ తట్టుకోలేకపోతుందని ట్వీట్లో విమర్శించారు సీఎం చంద్రబాబు.శాంతి భద్రతలను కాపాడే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవర్నీ ఉపేక్షించబోమన్నారు. అధికారంలో వున్నా ,ప్రతిపక్షంలో వున్నా సరే నిబంధనలు అందరికీ ఒకటేనన్నారు.హద్దులు దాటి ప్రవర్తిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు సీఎం చంద్రబాబు.
The criminalisation of politics has been the core culture of the @YSRCParty, and lawlessness was a hallmark of its tenure. We established the rule of law in 2024. Our culture is empowerment and service to the people. Even in opposition, they are resorting to abuse out of…
— N Chandrababu Naidu (@ncbn) February 1, 2026