తిరుపతి ప్యాసింజర్లో బాంబ్ కలకలం !
తిరుపతి నుండి గుంతకల్లు వెళ్తోన్న ప్యాసింజర్ ట్రైన్కు బాంబ్ బెదిరింపు కాల్ కలకలం రేపింది. అనంతపురం జిల్లా కదిరిలో ట్రైన్ను నిలిపివేసిన అధికారులు హుటాహుటినా బాంబ్స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. కాసేపు ప్రయాణికులంతా భయం గుప్పిట్లో గడిపారు. ఏక్షణాన ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమన్నారు.. వివరాల్లోకి వెళితే… అనంతపురం జిల్లా కదిరి వద్ద ప్యాసింజర్ ట్రైన్లో బాంబ్ ఉందంటూ అజ్ఞాత వ్యక్తులు లెటర్ రాసి ప్రయాణికుల మధ్యలో పడవేశారు. అది చూసిన ప్రయాణికులు ట్రైన్లోని మూడో […]
తిరుపతి నుండి గుంతకల్లు వెళ్తోన్న ప్యాసింజర్ ట్రైన్కు బాంబ్ బెదిరింపు కాల్ కలకలం రేపింది. అనంతపురం జిల్లా కదిరిలో ట్రైన్ను నిలిపివేసిన అధికారులు హుటాహుటినా బాంబ్స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. కాసేపు ప్రయాణికులంతా భయం గుప్పిట్లో గడిపారు. ఏక్షణాన ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమన్నారు.. వివరాల్లోకి వెళితే…
అనంతపురం జిల్లా కదిరి వద్ద ప్యాసింజర్ ట్రైన్లో బాంబ్ ఉందంటూ అజ్ఞాత వ్యక్తులు లెటర్ రాసి ప్రయాణికుల మధ్యలో పడవేశారు. అది చూసిన ప్రయాణికులు ట్రైన్లోని మూడో కోచ్లో బాంబు ఉన్నట్లుగా లేఖలో రాసి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు, కదిరి టౌన్ పోలీసులు రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. రైలు 3వ నెంబర్ కోచ్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి బాంబ్ లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గంట ఆలస్యంగా ట్రైన్ బయల్దేరింది.
తిరుపతి నుండి గుంతకల్లు వెళ్తోన్న ప్యాసింజర్లో బాంబ్ ఉందంటూ లేఖరాసిన ఆగంతకున్ని పోలీసులు గుర్తించారు. గణేష్ అనే వ్యక్తి ఆ లేఖరాసినట్లుగా తేల్చిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఎందుకు ఇలా చేశాడు.. ఈ ఘటన వెనక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.