
జగన్ సర్కార్ ట్రాన్స్జెండర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. సమాజంలో వారు గౌరవప్రదమైన జీవనం గడిపే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వీరికి కూడా వర్తింపజేస్తున్నట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం చొరవ మేరకు ఉపాధిహామీ పథకాన్ని ట్రాన్స్ జెండర్లకు కూడా అమలు చేయనుంది ఏపీ సర్కార్. దీంతో వారికి జాబ్ కార్డులు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ మేరకు మార్చి 15న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లు, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉపాధి హామి పనులు చేసేందుకు వచ్చే ఒక్కో ట్రాన్స్జెండర్ను ఒక్కో వ్యక్తిని ఒక్కో ఫ్యామిలీగా గుర్తించి జాబ్ కార్డులు ఇవ్వనున్నారు. అలాగే ఒకే పంచాయతీ పరిధిలో ఐదుగురు కంటే ఎక్కువమంది ట్రాన్స్ జెండర్లు… పనుల కోసం ముందుకొస్తే వారిని శ్రమశక్తి సంఘాలుగా గుర్తిస్తామని అధికారులు వెల్లడించారు.
సమాజంలో తమపై వివిక్ష కొనసాగుతోందని, పని దొరక్క ఇబ్బందులు పడుతున్నామని.. తమకు ప్రభుత్వమే ఆసరాగా ఉండాలంటూ గతకొంతకాలంగా ట్రాన్స్జెండర్లు కేంద్ర ప్రభుత్వానికి తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు. దీంతో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిక మంత్రిత్వశాఖ.. ట్రాన్స్జెండర్లకు కూడా ఉపాధిహామీ పథకాన్ని వర్తింప చేయాలని సూచించింది. దీంతో ఏపీ సర్కార్ కూడా సానుకూలంగా స్పందించి.. ట్రాన్స్జెండర్లకు జాబ్ కార్డులు ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వం పంపిన సర్క్యులర్ వివరాలు ఇలా ఉన్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ కిక్ చేయండి..