AP Government : పారిశుద్ధ్య కార్మికులకు గుడ్ న్యూస్.. 43 వేలమంది కుటుంబాల్లో నిండిన సంతోషం

|

Jul 23, 2022 | 8:39 PM

మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు పలు డిమాండ్‌లతో సమ్మెకు దిగారు. తమ జీతాలు పెంచాలంటూ మున్సిపల్, కార్పొరేషన్లలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా..

AP Government : పారిశుద్ధ్య కార్మికులకు గుడ్ న్యూస్.. 43 వేలమంది కుటుంబాల్లో నిండిన సంతోషం
Cm Jagan
Follow us on

AP Government : ఆంధ్రప్రదేశ్‌ మున్సిపాల్టీలో పనిచేసే పారిశుధ్య కార్మికులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పారిశుధ్య కార్మికులకు ఓహెచ్ఏ(ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అలవెన్సు)కు సంబంధించిన ఉత్తర్వులను ఆ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ మేరకు మున్సిపల్ కార్మికుల 15 వేల వేతనానికి అదనంగా 6 వేలు ఓ హెచ్ ఏను ప్రభుత్వం చెల్లించనునుంది. దాంతో పారిశుధ్య కార్మికుల వేతనాలు రూ. 21 వేలకు పెరిగినట్టయింది. తాజా ఉత్తర్వులతో దాదాపు 43 వేలమందికి పైగా కార్మికులకు మేలు జరగనుంది. ఈ ఉత్తర్వులు విడుదల చేయడం పట్ల కార్మికులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

ఇటీవల ఏపీలో మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు పలు డిమాండ్‌లతో సమ్మెకు దిగారు. తమ జీతాలు పెంచాలంటూ మున్సిపల్, కార్పొరేషన్లలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా ఆరోగ్య భృతిని కూడా తమ డిమాండ్లలో కార్మికులు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పారిశుధ్య కార్మికులతో మంత్రుల కమిటీ చర్చలు జరిపింది. చర్చల అనంతరం కార్మికుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ఆదేశించడం.. కేబినెట్‌ కమిటీ ద్వారా సమస్య పరిష్కారం త్వరగతిన పూర్తైంది. అంతేకాదు.. జీవో నం.233 ద్వారా ఇస్తున్న ఆరోగ్య భృతిని యథాతథంగా అమలు చేయనున్నట్లు తెలిపింది ఏపీ సర్కార్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి