AP IAS Officers Transfer: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌‌కు స్థానచలనం

|

Jun 04, 2021 | 9:38 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది. కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌.. మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ అయ్యారు.

AP IAS Officers Transfer: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌‌కు స్థానచలనం
AP Govt
Follow us on

AP IAS Officers Transfer: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది. కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌.. మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ అయ్యారు. కృష్ణాజిల్లా కొత్త కలెక్టర్‌గా నివాస్‌ బాధ్యతలు చేపట్టబోతున్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా ఎల్‌.ఎస్‌.బాలాజీరావుని నియమించిన ప్రభుత్వం.. గంధం చంద్రుడిని గ్రామ, వార్డు సచివాలయ డైరెక్టర్‌గా బదిలీ చేసింది. గోపాలకృష్ణ రోలంకి పాడేరు ఐటీడీఏ పీవోగా బదిలీ అయ్యారు. ఏపీ ఏజీఆర్‌వోఎస్‌ ఎండీగా కృష్ణమూర్తిని నియమించారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు హౌసింగ్‌ జేసీలుగా ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం బదిలీలు చేసింది. చిత్తూరు హౌసింగ్‌ జేసీగా డాక్టర్‌ వెంకటేశ్వర శైలజా మల, అనంతపురం హౌసింగ్‌ జేసీగా నిశాంతి, ప్రకాశం హౌసింగ్‌ జేసీగా కేఎస్‌ విశ్వనాథన్‌కు బాధ్యతలు అప్పగించారు. కడప హౌసింగ్‌ జేసీగా ధ్యాన్‌చంద్ర, తూర్పుగోదావరి జిల్లా హౌసింగ్‌ జేసీగా ఎం.జాహ్నవి, కృష్ణాజిల్లా హౌసింగ్‌ జేసీగా ఎస్‌.ఎన్‌.అజయ్‌కుమార్‌ బదిలీ అయ్యారు. గుంటూరు హౌసింగ్‌ జేసీగా అనుపమాంజలి, నెల్లూరు హౌసింగ్‌ జేసీగా విదేహ్‌ ఖరే, పశ్చిమగోదావరి జిల్లా హౌసింగ్‌ జేసీగా జీఎస్‌ ధనుంజయ్ బదిలీ అయ్యారు. విశాఖ హౌసింగ్‌ జేసీగా కల్పనాకుమారి, విజయనగరం హౌసింగ్‌ జేసీగా మౌర్య అశోక్‌, శ్రీకాకుళం హౌసింగ్‌ జేసీగా హిమాన్షు కౌశిక్‌లకు ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులిచ్చింది.

AP IAS Officers Transfers

AP IAS Officers Transfers 

Read Also…  AP : ఏపీ రాష్ట్ర సమాచార కమిషనర్లుగా మరో ఇద్దరు.. హరిప్రసాద్ రెడ్డి, చెన్నారెడ్డి చేత ప్రమాణస్వీకారం చేయించిన సిఎస్