విజయవాడలో దారుణం: నడిరోడ్డుపై అత్తను నరికి చంపిన అల్లుడు..!

|

Jun 25, 2023 | 7:23 AM

పిల్లనిచ్చిన అత్తామామలపై కక్ష్య సాధించాలనుకున్నాడు ఆ ఇంటి అల్లుడు. పథకం పన్ని నడి రోడ్డుపై అత్తను అత్యంత దారుణంగా హత్య చేశాడు. విజయవాడలో శనివారం (జూన్‌ 24) చోటుచేసుకున్న ఈ దారుణ..

విజయవాడలో దారుణం: నడిరోడ్డుపై అత్తను నరికి చంపిన అల్లుడు..!
Woman brutally murdered in AP
Follow us on

విజయవాడ: పిల్లనిచ్చిన అత్తామామలపై కక్ష్య సాధించాలనుకున్నాడు ఆ ఇంటి అల్లుడు. పథకంపన్ని నడి రోడ్డుపై అత్తను అత్యంత దారుణంగా హత్య చేశాడు. విజయవాడలో శనివారం (జూన్‌ 24) చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలంరేపింది. పోలీసుల కథనం ప్రకారం..

విజయవాడ జక్కంపూడి జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీకి చెందిన గొగుల నాగమణికి ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తెకు, ఆమె భర్త రాజేశ్‌కి విభేదాలు రావడంతో కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. ఈక్రమంలో భార్యను కాపురానికి పంపడంలేదని అత్తమామలపై కక్ష పెంచుకున్నాడు అల్లుడు రాజేశ్‌. అత్తమామలకు అంతమొందించాలని పథకంపన్నాడు. ఈ క్రమంలో వారితో మాట్లాడాలని నగర శివారు చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్‌ వద్దకు రమ్మని కబురుపంపాడు. బైక్‌పై అక్కడికి చేరుకున్న అత్తమామలను చంపేందుకు కత్తితో దాడి చేశాడు అల్లుడు రాజేశ్‌. వెంటనే మామను నరికేందుకు ప్రయత్నించగా, అతను పరారయ్యాడు.

ఆ తర్వాత అత్తపై దాడి చేసి కత్తితో నడిరోడ్డుపై దారుణంగా హత్య చేసి, పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు నాగమణి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న టూ టౌన్‌ కొత్తపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.