AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా కల్లోలం..గంటల వ్యవధిలో 14మంది మృతి..ఆక్సిజన్‌ లీకేజీతో మరణాలు అవాస్తవం.

అనంత సర్వజనాసుపత్రిలో కరోనా వైరస్ మరణ మృదంగం సృష్టించింది. గంటల వ్యవధిలో ఏకంగా 14మంది మృత్యువాత పడిన సంఘటన కలకలం రేపింది. అయితే ఈ మరణాలన్నీ ఆక్సిజన్...

కరోనా కల్లోలం..గంటల వ్యవధిలో 14మంది మృతి..ఆక్సిజన్‌ లీకేజీతో మరణాలు అవాస్తవం.
Anantapur District Collector Gandham Chandrudu
Anil kumar poka
|

Updated on: May 02, 2021 | 7:51 AM

Share

అనంత సర్వజనాసుపత్రిలో కరోనా వైరస్ మరణ మృదంగం సృష్టించింది. గంటల వ్యవధిలో ఏకంగా 14మంది మృత్యువాత పడిన సంఘటన కలకలం రేపింది. అయితే ఈ మరణాలన్నీ ఆక్సిజన్ లోపం కారణంగానే జరిగినట్లు ఆరోపణలు రావడం మరింత ఆందోళన రేకెత్తించింది. విషయం తెలుసుకున్న అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జాయింట్ కలెక్టర్లు నిశాంత్ కుమార్, డాక్టర్ సిరి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. వార్డులన్నీ తిరిగి లోపం ఎక్కడ ఉందన్న దానిపై ఆరా తీశారు.

రాత్రి 10గంటల సమయంలో ఆస్పత్రిని సందర్శించిన కలెక్టర్‌ అక్కడి పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణాలపై కొందరు కావాలని దుష్ప్రచారం చేశారని అన్నారు. వాస్తవంగా అనంతపురం జిల్లాలో ఆక్సిజన్ కొరత ఎక్కడా లేదన్నారు. అన్ని ఆస్పత్రుల్లో ఫైర్‌ సేఫ్టీ, విద్యుత్‌ విభాగాల్లో ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సంవత్సర కాలంలోనే జిల్లాలోని ఆరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 40 వేల లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశామన్నారు. మూతపడ్డ వాటిని కూడా తెరిపించామన్నారు.

కోవిడ్‌ రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. ఇక,ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కేఎస్‌ఎస్‌ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులతో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ చివరి నిమిషంలో ఇక్కడికి రావడంతో కొందరు మృతి చెందుతున్నారని చెప్పారు.

Follow Us
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే