డిప్లమాటిక్‌ పాస్‌పోర్టు తీసుకున్న సీఎం జగన్

| Edited By: Pardhasaradhi Peri

Jul 20, 2019 | 3:30 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతి డిప్లమేటిక్ పాస్ పోర్టు తీసుకున్నారు. విజయవాడలోని పాస్ పార్టు కార్యాలయానికి స్వయంగా వచ్చి ప్రస్తుతం ఉన్న సాధారణ పాస్ పోర్టు స్థానంలో డిప్లమేటిక్ పాస్ పోర్టు పొందారు. కాగా సీఎం హోదాలో ఆయనకు అధికారులు ఈ పాస్ పోర్టు జారీ చేశారు.  విజయవాడలోని రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసుకు వచ్చిన జగన్ దంపతులకు పాస్ పోర్టు కార్యాలయం అధికారులు డిప్లమేటిక్ పాస్ పోర్టు అందచేశారు. సీఎం రాక సందర్భంగా […]

డిప్లమాటిక్‌ పాస్‌పోర్టు తీసుకున్న సీఎం జగన్
Follow us on

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతి డిప్లమేటిక్ పాస్ పోర్టు తీసుకున్నారు. విజయవాడలోని పాస్ పార్టు కార్యాలయానికి స్వయంగా వచ్చి ప్రస్తుతం ఉన్న సాధారణ పాస్ పోర్టు స్థానంలో డిప్లమేటిక్ పాస్ పోర్టు పొందారు. కాగా సీఎం హోదాలో ఆయనకు అధికారులు ఈ పాస్ పోర్టు జారీ చేశారు.  విజయవాడలోని రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసుకు వచ్చిన జగన్ దంపతులకు పాస్ పోర్టు కార్యాలయం అధికారులు డిప్లమేటిక్ పాస్ పోర్టు అందచేశారు. సీఎం రాక సందర్భంగా పాస్ పోర్టు కార్యాలయం పరిసరాల్లో అధికారులు భద్రత మరింత పటిష్టం చేశారు. గతంలో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి కూడా ఈ పాస్ పోర్టు జారీ చేశారు. కాగా ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన తన డిప్లమేటిక్ పాస్ పోర్టుని తిరిగి అధికారులకు అప్పగించారు.