AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రశాంతంగా పల్నాడు.. మీడియాతో హోం మంత్రి సుచరిత

పల్నాడు ప్రాంతంలో ఎలాంటి అలజడులు లేకుండా ప్రశాంతంగా ఉందన్నారు ఏపీ హోం మంత్రి సుచరిత. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ప్రతిపక్ష టీడీపీ కావాలనే రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు. పల్నాడు గ్రామాల్లో ఉండలేని పరిస్థితులు ఉన్నాయంటూ, బాధితులంతా పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారని టీడీపీ దుష్ర్పచారం చేస్తోందని మండిపడ్డారు హోం మంత్రి. ఒకవేళ అదేపరిస్థితి ఉంటే ప్రజలు స్వేచ్ఛగా శాంతిభద్రతలతో జీవించే ఏర్పాట్లు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. పల్నాడు ప్రాంతంలో […]

ప్రశాంతంగా పల్నాడు.. మీడియాతో హోం మంత్రి సుచరిత
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 09, 2019 | 5:44 PM

Share

పల్నాడు ప్రాంతంలో ఎలాంటి అలజడులు లేకుండా ప్రశాంతంగా ఉందన్నారు ఏపీ హోం మంత్రి సుచరిత. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ప్రతిపక్ష టీడీపీ కావాలనే రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు.

పల్నాడు గ్రామాల్లో ఉండలేని పరిస్థితులు ఉన్నాయంటూ, బాధితులంతా పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారని టీడీపీ దుష్ర్పచారం చేస్తోందని మండిపడ్డారు హోం మంత్రి. ఒకవేళ అదేపరిస్థితి ఉంటే ప్రజలు స్వేచ్ఛగా శాంతిభద్రతలతో జీవించే ఏర్పాట్లు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. పల్నాడు ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించవద్దంటూ సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఎన్నికత తర్వాత ఇప్పటివరకు 46 మందిపై రౌడీ షీట్లు, 36 మందిపై సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేసినట్టు మంత్రి వివరించారు. ఇక్కడ నమోదైన రాజకీయ కేసులన్నీ ఎస్పీ ఆధ్వర్యంలో సమీక్షిస్తున్నట్టు మంత్రి సుచరిత తెలియజేశారు.

పల్నాడు, గురజాల ప్రాంతాల్లో అధికార వైసీపీ నేతలు ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అనుచరుల దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారంటూ టీడీపీ ఆరోపణలు చేస్తోంది. వైసీపీకి చెందిన వారు టీడీపీ కార్యకర్తలు, సానుభూతి పరులపై అకారణంగా భౌతిక దాడులకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. దీనికోసం టీడీపీ ఆధ్వర్యంలో పునరావాస శిబిరాలు కూడా ఏర్పాటు చేసింది. వీటికి పోటీగా వైసీపీ కూడా గత ప్రభత్వం హాయంలో తమ కార్యకర్తలపై జరిగిన దాడుల్లో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారి కోసం పునరావాస శిబిరాన్నిఏర్పాటు చేసింది.

పల్నాడు ప్రాంతంలో గత కొంతకాలంగా ఇటువంటి శిబిరాలు ఏర్పాటు చేయడంతో ఇరు పార్టీల్లో రాజకీయ వేడి రగులుకుంది. రెండు రోజుల క్రితం హోం మంత్రి సుచరిత సైతం పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ప్రతిపక్ష టీడీపీ కావాలనే ఆరోపణలు చేస్తుందని, ఇక్కడ ప్రజలంతా  ప్రశాంతంగా ఉన్నారని తెలిపారు.

Follow Us
విజయ్‏కు దెబ్బ మీద దెబ్బ.. రూ.120 కోట్ల డీల్ క్యాన్సిల్..
విజయ్‏కు దెబ్బ మీద దెబ్బ.. రూ.120 కోట్ల డీల్ క్యాన్సిల్..
17 నిమిషాల రేప్ సీన్ తో కాంట్రవర్సీ..కట్ చేస్తే కలెక్షన్ల వర్షం
17 నిమిషాల రేప్ సీన్ తో కాంట్రవర్సీ..కట్ చేస్తే కలెక్షన్ల వర్షం
వంటగ్యాస్ లేదా..దోంట్‌ వర్రీ! ఐరన్‌బాక్స్‌ ఉందిగా వాడేద్దామిలా!!
వంటగ్యాస్ లేదా..దోంట్‌ వర్రీ! ఐరన్‌బాక్స్‌ ఉందిగా వాడేద్దామిలా!!
ఈ తేదీల్లో జన్మించిన స్త్రీలు లక్ష్మీదేవితో సమానం..
ఈ తేదీల్లో జన్మించిన స్త్రీలు లక్ష్మీదేవితో సమానం..
రైతు భరోసా విడుదలకు డేట్ ఫిక్స్.. ప్రభుత్వం నుంచి అనౌన్స్‌మెంట్
రైతు భరోసా విడుదలకు డేట్ ఫిక్స్.. ప్రభుత్వం నుంచి అనౌన్స్‌మెంట్
మోనాలిసా భర్త బ్యాక్ గ్రౌండ్ ఇదే..వీరి లవ్ స్టోరీ మామూలుగా లేదుగా
మోనాలిసా భర్త బ్యాక్ గ్రౌండ్ ఇదే..వీరి లవ్ స్టోరీ మామూలుగా లేదుగా
పనికిరావని పడవేసే పాత్ టూత్ బ్రష్‌లతో.. క్రియేటివ్ ఐడియాస్
పనికిరావని పడవేసే పాత్ టూత్ బ్రష్‌లతో.. క్రియేటివ్ ఐడియాస్
నోట్లపై ఈ నల్లటి గీతలు ఎందుకుంటాయో తెలుసా..? 99శాతం మందికి..
నోట్లపై ఈ నల్లటి గీతలు ఎందుకుంటాయో తెలుసా..? 99శాతం మందికి..
వేసవిలో అత్యంత సుందర నగరంలో ఎంజాయ్ చేయండి.. వీసా కూడా అవసరం లేదు.
వేసవిలో అత్యంత సుందర నగరంలో ఎంజాయ్ చేయండి.. వీసా కూడా అవసరం లేదు.
రైల్లో రీల్స్ రచ్చ..ప్రయాణికుడి వీడియో వైరల్‌
రైల్లో రీల్స్ రచ్చ..ప్రయాణికుడి వీడియో వైరల్‌