ఏపీలోని జిల్లాలకు ఇంచార్జ్ మంత్రులను సీఎం జగన్ మోహన్ రెడ్డి నియమించారు. వారిలో శ్రీకాకుళంకు వెల్లంపల్లి శ్రీనివాస్, విజయనగరంకు శ్రీరంగనాధరాజు, విశాఖకు మోపిదేవి వెంకటరమణ, తూర్పు గోదావరికి ఆళ్ల నాని, పశ్చిమ గోదావరికి పిల్లి సుభాష్ చంద్రబోస్, కృష్ణాకు కన్నబాబు, గుంటూరుకు పేర్ని నాని, ప్రకాశంకు అనిల్ కుమార్, నెల్లూరుకు సుచరిత, కర్నూల్కు బొత్స సత్యనారాయణ, కడపకు బుగ్గన రాజేంద్రనాథ్, చిత్తూరుకు మేకపాటి గౌతమ్ రెడ్డి, అనంతపురంకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని జగన్ నియమించారు.