AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఛీ..ఛీ ఇదేం పైశాచికత్వం.. రెండేళ్లుగా బాలికపై స్వామీజీ అత్యాచారం

ఈ మధ్య దొంగ స్వామీజీల రాసలీలలు బయటపడటం పెరిగియింది. స్వామీజీల ముసుసులో వారు వెనక నడిపించే బాగోతాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. తాజాగా ఓ స్వామీజీ రెండెళ్ల పాటు ఓ బాలికను అత్యాచారం చేయడం కలకలం రేపుతోంది.

Andhra Pradesh: ఛీ..ఛీ ఇదేం పైశాచికత్వం.. రెండేళ్లుగా బాలికపై స్వామీజీ అత్యాచారం
Assault
Aravind B
|

Updated on: Jun 20, 2023 | 10:09 AM

Share

ఈ మధ్య దొంగ స్వామీజీల రాసలీలలు బయటపడటం పెరిగియింది. స్వామీజీల ముసుసులో వారు వెనక నడిపించే బాగోతాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. తాజాగా ఓ స్వామీజీ రెండెళ్ల పాటు ఓ బాలికను అత్యాచారం చేయడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే రాజమహేంద్రవరానికి ఓ బాలిక (15) చిన్నప్పుడే తన తల్లిదండ్రులను కోల్పోయింది. ఆమె బంధువులు తనని 10వ తరగతి వరకు చదివించారు. ఆ తర్వాత విశాఖపట్నంలోని కొత్త వెంకోజి పాలెం వద్ద ఉన్న జ్ఞాననంద అనే ఆశ్రమానికి పంపించారు. ఆ ఆశ్రమాన్ని పూర్ణానంద అనే స్వామీజీ నిర్వహిస్తున్నాడు. అతడు ఆ అమ్మాయికి ఆవులకు మేత వేయడం, పేడ తీయడం లాంటి పనులు చేయించేవాడు. అయితే కొద్దిరోజులకే ఆ స్వామీజీకి ఆ బాలికపై కన్ను పడింది. ఎలాగైన ఆమెను అనుభవించాలనుకున్నాడు. చివరికి అత్యాచారనికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి ప్రతిరోజూ పూర్ణానంద అతడి గదిలోకి ఆమెను అత్యాచారం చేసేవాడు.

అంతేకాదు ఆ స్వామీజీ ఆమెను అతడి గదిలోనే కాళ్లకు గోలుసులు కట్టి బంధించేవాడు. ఆమె ఎదురువస్తే కొట్టేవాడు కూడా. అలాగే ఆహారం పెట్టకుండా ఇబ్బంది పట్టేవాడు. కేవలం రెండు చెంచాలతో అన్నాన్ని మాత్రమే నీటితో కలిపి పెట్టేవాడు. ఆమె కాలకృత్యాలు తీసుకునేందుకు అనుమతించేవాడు కాదు. ఇక చేసేదేమి లేక ఆమె బకెట్‌లోనే తీర్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అలాగే రెండు వారాలకొకసారి ఆమె స్నానం చేయాల్సిన దుస్థితి. ఇలా సుమారు రెండు సంవత్సరాల వరకు ఆ బాలికను చిత్రహింసలు పెట్టాడు. అయితే ఇటీవల జూన్ 13న ఓ పనిమనిషి సహాయంతో ఆ బాలిక తప్పించుకుంది. అక్కడి నుంచి పారిపోయి తనకు పరిచయమైన ఓ మహిళకు తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పింది. దీంతో ఆ మహిళ ఆ బాలికను కృష్ణా జిల్లాలోని కంకిపాడులో ఉన్న హాస్టల్లో చేర్చాలని యత్నించింది. కానీ హాస్టల్ నిర్వాకులు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఆమెను చేర్చుకోవాలంటే పోలీస్ స్టేషన్ నుంచి పర్మిషన్ లెటర్ తీసుకురావాలన్నారు.

ఇక చివరికి ఆ మహిళ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా పోలీసులు లెటర్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ బాలికను బాలల సంక్షేమ కమిటీకి తీసుకెళ్లింది. ఆమె అనుభవించిన నరకాన్ని అక్కడ ఉన్నవారికి వివరించింది. అనంతరం సీడబ్య్లూసీ సభ్యులు విజయవాడలోని దిశా పోలీస్ స్టేషన్‌కు ఆమెను పంపించారు. ఆ బాలిక చెప్పిన వివరాల ప్రకారం పూర్ణానంద స్వామీజీపై ఫోక్సో కేసు నమోదు చేశారు. ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపిచారు. ఎట్టకేలకు ఆ స్వామీజీని విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆ బాలికను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రి తరలించారు. అయితే పూర్ణానంద స్వామిజీ దీనిపై స్పందించారు. కొంతమంది ఆశ్రమ భూములు కొట్టేయాలని చూస్తున్నారని.. ఈ నేపథ్యంలోనే కుట్ర జరిగిందని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?