AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైజాగ్ ఐటీ ఉద్యోగిని మృతి కేసులో సరికొత్త ట్విస్ట్.. పోలీసుల తీరుపై తండ్రి సంచలన ఆరోపణలు!

విశాఖపట్నంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఐటీ రంగంలో మంచి భవిష్యత్తు ఉన్న ఓ యువతి ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడం వెనుక ఉన్న అసలు నిజాలను వెలికితీయాలని, తన కూతురి మరణానికి కారణమైన వారికి శిక్ష పడేలా చేయాలని ఆమె తండ్రి చేస్తున్న పోరాటం అందరినీ కదిలిస్తోంది.

వైజాగ్ ఐటీ ఉద్యోగిని మృతి కేసులో సరికొత్త ట్విస్ట్.. పోలీసుల తీరుపై తండ్రి సంచలన ఆరోపణలు!
Vizag It Employee Death Case
Balaraju Goud
|

Updated on: Jun 24, 2026 | 4:15 PM

Share

విశాఖపట్నంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఐటీ రంగంలో మంచి భవిష్యత్తు ఉన్న ఓ యువతి ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడం వెనుక ఉన్న అసలు నిజాలను వెలికితీయాలని, తన కూతురి మరణానికి కారణమైన వారికి శిక్ష పడేలా చేయాలని ఆమె తండ్రి చేస్తున్న పోరాటం అందరినీ కదిలిస్తోంది.

ఆర్థికంగా, సామాజికంగా ఎంతో ఉన్నత స్థానానికి చేరుకుంటుందని ఆశించిన కుమార్తె.. అగ్నిప్రమాదంలోనో.. ఆత్మహత్య రూపంలోనో మరణించిందని తెలిసి ఆ కుటుంబం కుప్పకూలిపోయింది. అయితే, పోలీసుల ప్రాథమిక దర్యాప్తు తీరుపై, మరణం వెనుక ఉన్న కారణాలపై తండ్రి తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ హత్యేనని, దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపిస్తున్నారు.

మరోవైపు, ఈ కేసులో నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టకూడదని, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ “జస్టిస్ ఫర్ రాధా గాయత్రి” (Justice for Radha Gayatri) పేరుతో నెటిజన్లు ఆ తండ్రి పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నారు. ఒక కన్నతండ్రిగా తన కూతురికి న్యాయం జరిగే వరకు, నిజా నిజాలు బయటకు వచ్చేవరకు విశ్రమించనని ఆయన కన్నీటితో చెప్తున్న మాటలు సమాజాన్ని ఆలోచింపజేస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us