కరోనా అప్డేట్స్: ఏపీలో మళ్లీ పెరిగిన కేసులు.. 3 వేలు దాటేసిన సంఖ్య..!
ఏపీలో కరోనా విజృంభణ ఆగడం లేదు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 9,370 శాంపిల్స్ని పరీక్షించగా.. 98 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కరోనా విజృంభణ ఆగడం లేదు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 9,370 శాంపిల్స్ని పరీక్షించగా.. 98 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,042కు చేరింది. కరోనాతో తాజాగా కృష్ణ జిల్లాలో ఒకరు, చిత్తూరులో ఒకరు మరణించారు. ఈ క్రమంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 62కు చేరింది. ఇక 24 గంటల్లో 43 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అవ్వగా.. ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,135కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 845 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక ఇతర దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 111 మందికి కరోనా నిర్ధారణ కాగా.. వారిలో ఇంకా ఒక్కరు కూడా కోలుకోలేదు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 418 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వారిలో ఇవాళ 8 మంది డిశ్చార్జ్ అవ్వగా.. మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 197కు చేరింది. మిగిలిన 221 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తాజా బులెటిన్ను విడుదల చేసింది. రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 4 లక్షలకు చేరువలో ఉంది.
Read This Story Also: వలస కూళీల కోసం కాశీ విశ్వనాథ్ ఆలయం కీలక నిర్ణయం..!
#COVIDUpdates: as on 31/05/2020Total cases: 3042Discharged: 2135Deceased: 62Active cases: 845#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/OoB6AA9hp3
— ArogyaAndhra (@ArogyaAndhra) May 31, 2020