వలస కూలీల కోసం కాశీ విశ్వనాథ్ ఆలయం కీలక నిర్ణయం..!

వలస కార్మికుల కోసం ప్రముఖ కాశీ విశ్వనాథ్ ఆలయం కీలక నిర్ణయం తీసుకుంది. వలస కార్మికులకు ఉపాధి కల్పించాలని భావించింది.

వలస కూలీల కోసం కాశీ విశ్వనాథ్ ఆలయం కీలక నిర్ణయం..!
Follow us

| Edited By:

Updated on: May 31, 2020 | 4:39 PM

వలస కార్మికుల కోసం ప్రముఖ కాశీ విశ్వనాథ్ ఆలయం కీలక నిర్ణయం తీసుకుంది. వలస కార్మికులకు ఉపాధి కల్పించాలని భావించింది. ప్రధాని మోదీ కలల ప్రాజెక్ట్ అయిన కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్‌ పనుల్లో వెయ్యి మంది వలస కార్మికులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. కారిడార్‌లో పని కోసం సంప్రదించడానికి ఫోన్‌ నంబర్లను కూడా విడుదల చేసింది.

అంతేకాదు వలస కార్మికుల కోసం ఓ పోర్టల్‌ని ప్రారంభించాలని వారణాసి జిల్లా యంత్రాంగం ఆలోచనలో ఉంది. ఈ క్రమంలో వారి వారి నైపుణ్యాలను బట్టి వారిని వివిధ ప్రభుత్వ ప్రాజెక్ట్‌లతో పాటు ప్రైవేట్ సంస్థలు చేపట్టే ప్రాజెక్ట్‌ల్లోనూ ఉపయోగించుకోనున్నారు. కాగా లాక్‌డౌన్ 3.0 సడలింపుల్లో భాగంగా కారిడార్ పనులను తిరిగి ప్రారంభించిన సమయంలో అధికారులకు ఈ ఆలోచన కలిగింది. ఆ ప్రాజెక్ట్‌లో పనిచేసే చాలా మంది కార్మికులు ఆ సమయంలో వారి వారి ఇళ్లకు వెళ్లడంతో.. వలస కార్మికులకు అవకాశం ఇవ్వాలని అధికారులు భావించారు.

Read This Story Also: తేనెటీగల దాడి.. తృటిలో తప్పించుకున్న చిరు, చెర్రీ..!