శ్రీలంకలో జకీర్ నాయక్‌ ఛానెల్‌కు చెల్లు..!

| Edited By:

May 02, 2019 | 12:06 PM

ఇస్లాం మత ప్రబోధకుడు జకీర్‌ నాయక్‌కు చెందిన పీస్‌ టీవీని శ్రీలంకలో నిషేధించారు. దుబాయ్ కేంద్రంగా ప్రసారాలు జరుగుతున్న పీస్ టీవీలో తన బోధనల ద్వారా జకీర్ నాయక్ యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే భారత్‌, బంగ్లాదేశ్‌లు ఈ ఛానెల్‌పై నిషేధం విధించాయి. ముంబైకి చెందిన ఇస్లామిక్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌-జకీర్ నాయక్ సంయుక్తంగా 2006లో పీస్ టీవీని స్థాపించారు. 2009లో ఉర్దూ, 2011లో బంగ్లా వెర్షన్‌ను కూడా ప్రారంభించారు. ఉగ్రవాదులతో సంబంధాలు, మనీలాండరింగ్ […]

శ్రీలంకలో జకీర్ నాయక్‌ ఛానెల్‌కు చెల్లు..!
Follow us on

ఇస్లాం మత ప్రబోధకుడు జకీర్‌ నాయక్‌కు చెందిన పీస్‌ టీవీని శ్రీలంకలో నిషేధించారు. దుబాయ్ కేంద్రంగా ప్రసారాలు జరుగుతున్న పీస్ టీవీలో తన బోధనల ద్వారా జకీర్ నాయక్ యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే భారత్‌, బంగ్లాదేశ్‌లు ఈ ఛానెల్‌పై నిషేధం విధించాయి. ముంబైకి చెందిన ఇస్లామిక్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌-జకీర్ నాయక్ సంయుక్తంగా 2006లో పీస్ టీవీని స్థాపించారు. 2009లో ఉర్దూ, 2011లో బంగ్లా వెర్షన్‌ను కూడా ప్రారంభించారు. ఉగ్రవాదులతో సంబంధాలు, మనీలాండరింగ్ వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న జకీర్ నాయక్‌పై ఎన్ఐఏ దర్యాప్తు జరుపుతోంది.