భారత కుబేరులకు కేరాఫ్‌గా మారుతోన్న UAE.. ఇండియా నుంచి వలసలు ఎందుకు పెరిగాయి..?

ఇప్పుడు ఇదో ట్రెండ్.. మన దేశంలోని అపర కుబేరులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కు వలసపోతున్నారు. ఆ దేశంలో భారీ పెట్టుబడులు పెడుతున్నారు. మరీ ముఖ్యంగా వీరిలో ఎక్కువ మంది దుబాయ్‌ని తమ పెట్టుబడులకు అడ్డాగా మార్చుకుంటున్నారు. పెట్టుబడి అవకాశాలతో పాటు మెరుగైన జీవనశైలి భారత్‌కు చెందిన సంపన్నులను UAE ఆకర్షిస్తోంది.

భారత కుబేరులకు కేరాఫ్‌గా మారుతోన్న UAE.. ఇండియా నుంచి వలసలు ఎందుకు పెరిగాయి..?
India Richest In UAE

Edited By:

Updated on: Jun 26, 2024 | 9:49 AM

శతాబ్ధాల కాలం నుంచే భారతీయులు మెరుగైన అవకాశాలు వెతుక్కొంటూ ఇతర దేశాలకు వలసలు వెళ్తున్నారు. నిన్న మొన్నటి వరకు భారతీయులు వలసలు వెళ్లే  దేశాల జాబితాలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడాల పేర్లే ప్రముఖంగా వినిపించేవి. తాజా నివేదిక మేరకు భారతీయులు మెరుగైన అవకాశాల కోసం ఇప్పుడు మరో దేశం వైపు చూస్తున్నారు. అదే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ). మరీ ముఖ్యంగా భారత్‌కు చెందిన అపర కుబేరులు ఆ దేశానికి మకాం మారుస్తున్నారు. అవకాశాల స్వర్గమైన ఆ దేశంలో భారీ పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. మరీ ముఖ్యంగా వీరిలో ఎక్కువ మంది దుబాయ్‌ని తమ పెట్టుబడులకు అడ్డాగా మార్చుకుంటున్నారు. స్వామి కార్యం.. స్వకార్యం అన్నట్లు దుబాయ్ ఆర్థిక ప్రగతిలో భాగస్వామ్యం అవుతూనే.. తమ సంపద గ్రాఫ్‌ను భారీగా పెంచుకుంటున్నారు.  పెట్టుబడి అవకాశాలతో పాటు మెరుగైన జీవనశైలి కారణంగా భారత సంపన్నులు యూఏఈ వైపు ఆకర్షితులవుతున్నారు. మరికొందరు భారత్‌లో ఉంటూనే అక్కడ భారీ పెట్టుబడులతో భారీగా ఆర్జిస్తున్నారు. యూఏఈ జనాభాలో అత్యధికంగా భారతీయులు ఉన్నారు. జీఎంఐ గణాంకాల మేరకు యూఏఈ మొత్తం జనాభా 1.24 కోట్లు కాగా.. ఇందులో 39.10 లక్షల మంది భారతీయులు ఉన్నారు. యూఏఈ మొత్తం జనాభాలో ఏకంగా 38.2 శాతం మంది భారతీయులే...

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి