AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇటలీలో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు.. పదవి కోల్పోయే ప్రమాదంలో జార్జియా మెలోని!

డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుద్ధం మొదటి ప్రభావం ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనిపై పడింది. ఇటలీలో న్యాయ సంస్కరణలపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మెలోని ఘోర పరాజయం పాలయ్యారు. 2022 తర్వాత ఒక ఎన్నికలో మెలోనికి ఎదురుదెబ్బ తగలడం ఇదే మొదటిసారి. ఓటర్ల అభిప్రాయం ఇదే విధంగా కొనసాగితే, ఆమె సమీప భవిష్యత్తులో తన పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది.

ఇటలీలో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు.. పదవి కోల్పోయే ప్రమాదంలో జార్జియా మెలోని!
Italy Pm Giorgia Meloni
Balaraju Goud
|

Updated on: Mar 24, 2026 | 10:54 AM

Share

డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుద్ధం మొదటి ప్రభావం ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనిపై పడింది. ఇటలీలో న్యాయ సంస్కరణలపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మెలోని ఘోర పరాజయం పాలయ్యారు. 2022 తర్వాత ఒక ఎన్నికలో మెలోనికి ఎదురుదెబ్బ తగలడం ఇదే మొదటిసారి. ఓటర్ల అభిప్రాయం ఇదే విధంగా కొనసాగితే, ఆమె సమీప భవిష్యత్తులో తన పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే వచ్చే ఏడాది ఇటలీలో ప్రధానమంత్రి పదవికి సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, న్యాయ సంస్కరణలపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో 54 శాతం మంది ప్రజలు మెలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. దీని అర్థం, ప్రధాని మెలోని ఇకపై ఇటాలియన్ న్యాయవ్యవస్థలో ఎక్కువగా జోక్యం చేసుకోలేరు.

యుగోవ్ అనే సర్వే సంస్థ, ప్రజాభిప్రాయ సేకరణకు ముందు ఒక పోల్ నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం, 77 శాతం మంది ఇటాలియన్లు మెలోని ప్రభుత్వ పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. యుద్ధం కారణంగా ఇంధన ధరలు అకస్మాత్తుగా పెరగడమే ప్రజల ప్రధాన ఆందోళనకు కారణమైంది. ఐరోపాలోనే విద్యుత్‌కు అత్యధిక ధర చెల్లిస్తున్నది తామేనని ఇటాలియన్లు పేర్కొన్నారు. యుద్ధం ఈ పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు.

పొలిటికో సర్వే ప్రకారం, 2024 తర్వాత, మెలోని తనను తాను అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితురాలిగా చిత్రీకరించుకోవడానికి ప్రయత్నించారు. అనేక సందర్భాల్లో, యూరోపియన్ నాయకులు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, మెలోని బహిరంగంగా ఆయనకు మద్దతు ఇచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణకు ముందు, తాము కూడా ఈ సంఘర్షణలోకి లాగుతారేమోనని సాధారణ పౌరులు భయపడ్డారు. ఈ అభిప్రాయాన్ని తొలగించడంలో మెలోని విఫలమయ్యారు.

ఇటాలియన్ పార్లమెంటులో ఇరాన్‌లోని మినాబ్ పాఠశాలపై జరిగిన దాడిని మెలోని ఖండించారు. కానీ ఆమె ట్రంప్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఇటాలియన్ ప్రతిపక్ష నాయకులు ఈ విషయాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారు. మెలోనిని వ్యతిరేకించిన ఇటాలియన్ వామపక్ష పార్టీ, న్యాయ సంస్కరణలపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణను నిరంకుశత్వంతో పోల్చింది.

ఇటాలియన్ వార్తా సంస్థ డీకోడ్ 39 కథనం ప్రకారం, ఇటాలియన్ ప్రజలు ట్రంప్‌పై కోపంగా ఉన్నారు. ఈ విషయం అనేక సర్వేలలో ప్రతిబింబించింది. దీని ఫలితంగా మెలోని పరోక్షంగా నష్టపోయారు. యూరో మీడియా ప్రకారం, 58 శాతం మంది ఇటాలియన్ పౌరులు మధ్యప్రాచ్యం నుండి ఇటాలియన్ దళాలు ఉపసంహరించుకోవాలని, అలాగే ఇటలీ – అమెరికా – ఇజ్రాయెల్‌ల నుండి దూరం పాటించాలని కోరుకుంటున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us