Ukraine: కిండర్‌ గార్డెన్‌ స్కూల్‌ సమీపంలో కూలిన హెలికాప్టర్‌…హోం మంత్రి సహా 18 మంది మృతి..

|

Jan 18, 2023 | 2:52 PM

ఈ వీడియోలో మండుతున్న భవనం కనిపిస్తుంది. ప్రమాదం ఎలా జరిగింది.? ఏం జరిగింది అనే దాని సమాచారం ప్రస్తుతానికి అందలేదు. వీడియోలో పెద్ద ఎత్తున మంటల్లో కాలిపోతున్న హెలికాప్టర్ శిథిలాలతో కనిపిస్తుంది.

Ukraine: కిండర్‌ గార్డెన్‌ స్కూల్‌ సమీపంలో కూలిన హెలికాప్టర్‌...హోం మంత్రి సహా 18 మంది మృతి..
Ukraine
Follow us on

రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం మొదలై రోజులు, నెలలూ గడిచిపోతున్నాయి తప్ప పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఉక్రెయిన్ పై తమ ఆధిపత్యం సాధించేందుకు రష్యా సైనిక చర్య పేరుతో అల్లకల్లోల పరిస్థితులు ను సృష్టించింది. ఉక్రెయిన్ పై తీవ్రస్థాయిలో దాడులకు పాల్పడింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో తాజాగా రాజధాని కైవ్ సమీపంలో భారీ హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. చిన్నారులు చదువుకుంటున్న ఒక స్కూల్‌ సమీపంలో హెలికాప్టర్ పడిపోయింది. దీంతో భారీ నష్టం జరిగింది.పిల్లలతో సహా చాలా మంది మృత్యువాతపడ్డారు.

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడుల మధ్య రాజధాని కీవ్ సమీపంలోని బ్రోవరీ నగరంలో బుధవారం జరిగిన భారీ హెలికాప్టర్ ప్రమాదంలో స్థానిక అంతర్గత మంత్రితో సహా దాదాపుగా18 మంది మరణించినట్లు సమాచారం. చనిపోయినవారిలో చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో కుట్ర జరిగే అవకాశాలను తోసిపుచ్చలేమని ఉక్రెయిన్ హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. నివాస ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో 10 మంది పిల్లలతో సహా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. వారిని ఆసుపత్రిలో చేర్పించారు.

ఇవి కూడా చదవండి

హెలికాప్టర్ ప్రమాదంలో బ్రోవరీ మంత్రి, ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల డిప్యూటీ మంత్రి మరణించారని ఉక్రెయిన్ భద్రతా నిపుణుడు మరియా అవదీవా ట్వీట్ చేశారు. స్థానిక కిండర్ గార్డెన్ సమీపంలో అత్యవసర సేవా హెలికాప్టర్ పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో ఇద్దరు చిన్నారులు సహా 16 మంది చనిపోయారు.
ప్రమాదం తర్వాత భీకర మంటలు చెలరేగాయి. బ్రోవరీ పట్టణంలోని నివాస భవనం సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ప్రమాదం అనంతరం భవనం సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ భవనంలో చిన్నారులు సహా పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు.

మృతుల సంఖ్యను అంచనా వేస్తున్నట్లు రాష్ట్రపతి సహాయకుడు తెలిపారు. కాలిపోతున్న భవనంలో పిల్లలు ఇప్పటికీ ఉన్నారు. మేము పరిస్థితుల గురించి సమాచారాన్ని సేకరిస్తున్నామని చెప్పారు. ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మండుతున్న భవనం కనిపిస్తుంది. ప్రమాదం ఎలా జరిగింది.? ఏం జరిగింది అనే దాని సమాచారం ప్రస్తుతానికి అందలేదు. వీడియోలో పెద్ద ఎత్తున మంటల్లో కాలిపోతున్న హెలికాప్టర్ శిథిలాలతో కనిపిస్తుంది.

ఆగ్నేయ ఉక్రెయిన్‌లోని నివాస భవనంపై రష్యా జరిపిన క్షిపణి దాడిలో ఐదుగురు చిన్నారులు సహా మొత్తం 44 మంది మరణించారు. శిథిలాల నుంచి చిన్నారుల మృతదేహాన్ని వెలికితీసినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ఒకే చోట పెద్ద సంఖ్యలో జనాలు గుమిగూడిన చోటును టార్గెట్‌ చేసుకుని జరిగిన దాడిని అత్యంత ఘోరమైనదిగా మండిపడుతున్నారు.

శనివారం జరిగిన దాడిలో ఐదుగురు చిన్నారులు సహా 44 మంది మృతి చెందగా, 79 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయ డిప్యూటీ హెడ్ కిరిల్లో తిమోషెంకో తెలిపారు. దాదాపు 1,700 మంది బహుళ అంతస్తుల భవనంలో నివసించారు మరియు చివరి మృతుల సంఖ్య దాడి తర్వాత తప్పిపోయిన రెండు డజన్ల మందిని కలిగి ఉన్నారని ఆయన చెప్పారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..