India – Pakistan Trade: భారత్‌ నుంచి షుగర్, కాటన్ దిగుమతులపై పాక్ ప్రధాని కీలక ప్రకటన

|

Apr 03, 2021 | 12:37 PM

Pakistan PM Imran Khan: భారత్‌తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక ప్రకటన చేశారు. భారత్ నుంచి షుగర్, కాటన్ దిగుమతి చేసుకోవాలన్న నిర్ణయాన్ని 24 గం.లు గడవకముందే పాకిస్థాన్ ఉపసంహరించుకోవడం తెలిసిందే.

India - Pakistan Trade: భారత్‌ నుంచి షుగర్, కాటన్ దిగుమతులపై పాక్ ప్రధాని కీలక ప్రకటన
India PM Narendra Modi - Pakistan PM Imran Khan
Follow us on

భారత్‌తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక ప్రకటన చేశారు. భారత్ నుంచి షుగర్, కాటన్ దిగుమతి చేసుకోవాలన్న నిర్ణయాన్ని 24 గం.లు గడవకముందే పాకిస్థాన్ ఉపసంహరించుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Pakistan PM Imran Khan) ఓ ప్రకటన చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌తో ఎలాంటి వాణిజ్య సంబంధాలు చేపట్టబోమని ఆయన స్పష్టంచేశారు. కీలక మంత్రులతో సంప్రదింపుల తర్వాత ఇమ్రాన్ ఖాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ మీడియా వర్గాలు శనివారం వెల్లడించాయి.

పాకిస్థాన్ తీసుకున్న తాజా నిర్ణయంతో భారత్ నుంచి ఆ దేశంలోకి ఇప్పట్లో షుగర్, కాటన్ దిగుమతులు ఉండబోవని తేలిపోయింది. ప్రస్తుతం పాక్‌లో షుగర్ కొరత నెలకొనడంతో దాని ధరలు గణనీయంగా పెరిగాయి. అలాగే ఇతర వస్తువుల ధరలు కూడా మండిపోతున్నాయి. డిపాండ్-సప్లై మధ్య సమతౌల్యత తీసుకొచ్చేందుకు విదేశాల నుంచి తక్కువ ధరకు ఆ వస్తువులను దిగుమతి చేసుకోవడంపై దృష్టిసారించాలని ఆ దేశ వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు, ఆర్థిక నిపుణులను ఇమ్రాన్ ఖాన్ ఆదేశించినట్లు డాన్ పత్రిక వెల్లడించింది. ఈ విషయంలో ఎకనామిక్ కోఆర్డినేషన్ కమిటీ సిఫార్సులపై చర్చించిన తర్వాత పాక్ కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది.

భారత్ నుంచి దిగుమతులను నిరాకరించడంతో పాకిస్థాన్‌లో ద్రవ్యోల్భణం మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ధరాఘాతంతో పాక్ ప్రజలు విలవిలలాడుతున్నారు. ఈ నేపథ్యంలో ధరలను నియంత్రించడం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది.

ఇది కూడా చదవండి..US Capitol: యూఎస్ క్యాపిటల్‌ భవనం వద్ద మళ్లీ అలజడి.. బారికేడ్లపై దూసుకెళ్లిన కారు.. ఓ అధికారి మృతి

Mrbeast Coffin Video: 50 గంట‌ల పాటు స‌జీవ స‌మాధి.. యూట్యూబ‌ర్ స్టంట్‌.. చివరకు ఏమైందంటే..?‌