
స్వీడిష్ అకాడమీ గురువారం (అక్టోబర్ 9, 2025) సాహిత్యంలో నోబెల్ బహుమతిని ప్రకటించింది. ఈ సంవత్సరం, హంగేరీకి చెందిన లాస్జ్లో క్రాస్జ్నాహోర్కైకి సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. ఈ అవార్డును అత్యుత్తమ పుస్తకాలు, కవితలు రాయడం ద్వారా సాహిత్యానికి గణనీయమైన కృషి చేసిన రచయితలకు ఇస్తారు. తన నవల హెర్ష్ట 07769 కి 2025 సాహిత్య నోబెల్ బహుమతిని అందుకోబోతున్నారు. ఇది సమకాలీన జర్మనీ సామాజిక అశాంతిని, హింస, ఆధ్యాత్మిక సమిళితంతో రూపొందిన నవలగా గుర్తింపు లభించింది.
1954లో హంగేరీ, రొమేనియా సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్యులా అనే చిన్న పట్టణంలో జన్మించిన క్రాస్జ్నాహోర్కై తన సుదీర్ఘమైన, సంక్లిష్టమైన రచనలు, లోతైన తాత్వికత్వాన్ని ప్రతిభింబిస్తాయి. యూరోపియన్ సంప్రదాయంలో ఒక ఇతిహాస రచయితగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఫ్రాంజ్ కాఫ్కా, థామస్ బెర్న్హార్డ్లతో పోలిస్తే అతని రచనలు అసంబద్ధత, వింతైన చిత్రాలు, ఆధ్యాత్మిక ఆత్మపరిశీలనను మిళితం చేస్తాయి. మానవత్వం, అరాచకం, ఆధునిక సమాజంలోని సంక్షోభాలను నిష్కపటంగా ప్రస్తావిస్తాయి. మొత్తంమీద, లాజ్లో లోతైన ఆలోచనాత్మక, విచారకరమైన కథలను రాయడం ద్వారా ప్రపంచ ఖ్యాతి గడించారు. క్రాస్జ్నాహోర్కై మధ్య యూరోపియన్ సంప్రదాయంలో గొప్ప ఇతిహాస రచయితగా అభివర్ణించింది. అతని రచన కాఫ్కా ద్వారా థామస్ బెర్న్హార్డ్ వరకు విస్తరించింది. అసంబద్ధత, వికారమైన మితిమీరిన లక్షణం కలిగి ఉందని నోబెల్ కమిటీ అభిప్రాయపడింది.
సామాజిక ఆరాచకం, హింస, దహనకాండలతో చుట్టుముట్టిన ఒక చిన్న తురింగియన్ పట్టణాన్ని చిత్రీకరించడంలో దాని ఖచ్చితత్వానికి 2025 అవార్డు గెలుచుకున్న అతని రచన హెర్ష్ట్ 07769 గొప్ప సమకాలీన జర్మన్ నవల అని భావిస్తున్నారు. జోహన్ సెబాస్టియన్ బాచ్ సాంస్కృతిక వారసత్వానికి వ్యతిరేకంగా రూపొందించిన ఈ నవల, మానవ అనుభవంలో హింస, అందం ఎలా కలిసి ఉంటాయో వివరించింది.
హంగేరీ, రొమేనియా సరిహద్దుకు సమీపంలో జరిగిన అల్లర్ల మృతుల నుండి తిరిగి వచ్చారని నమ్ముతున్న ఇద్దరు మర్మమైన వ్యక్తుల నుండి మోక్షం కోసం ఎదురుచూస్తున్న పేద నివాసితుల కథ అనుసరిస్తుంది ఆయన ఈ నవల రాశారు. ఈ నవల తరువాత 1994లో దర్శకుడు బ్లా టార్ చేత ఒక మైలురాయి చిత్రంగా మార్చారు. ఇది ఇద్దరు కళాకారుల మధ్య సుదీర్ఘ సృజనాత్మక భాగస్వామ్యానికి నాంది పలికింది. సృష్టి వివరించలేని చర్యకు వరుస ద్వారాల ద్వారా నడిపించే అతని సామర్థ్యాన్ని నోబెల్ కమిటీ ప్రశంసించింది. అతని మేధో దృఢత్వం, భావోద్వేగ ప్రతిధ్వని అరుదైన కలయికగా పేర్కొంది.
లాస్జ్లో క్రాస్జ్నాహోర్కై విజయం యూరప్లోని అత్యంత ముఖ్యమైన సమకాలీన నవలా రచయితలలో అతని స్థానాన్ని సుస్థిరం చేస్తుంది. క్రాస్జ్నాహోర్కై తన 1985 తొలి చిత్రం స్టెంటాంగో (సాటాంటాంగో)తో అంతర్జాతీయ ప్రశంసలు పొందారు. ఇది కూలిపోతున్న హంగేరియన్ గ్రామంలో జీవితాన్ని ప్రతిబింబించే దిగాలుగా ఉన్నప్పటికీ సాహిత్యపరంగా ఉంటుంది. తన దశాబ్దాల కెరీర్లో తూర్పు ఆసియా తత్వశాస్త్రం, ప్రకృతి దృశ్యాల నుండి ప్రేరణ పొందారు. అశాశ్వతం, అందం, సృష్టి ఆలోచనాత్మక ఇతివృత్తాలను కలుపుతూ రచనలు సాగించారు.
2003లో ఆయన రాసిన నవల “ఎ మౌంటైన్ టు ది నార్త్, ఎ లేక్ టు ది సౌత్, పాత్స్ టు ది వెస్ట్, ఎ రివర్ టు ది ఈస్ట్” క్యోటో సమీపంలో ఆధ్యాత్మిక అన్వేషణపై ఒక సాహిత్య ధ్యానంగా మారిపోయింది. ఆ రచన తర్వాత సీయోబో దేర్ బిలో (2008), ఫైబొనాక్సీ క్రమంలో అమర్చిన పదిహేడు పరస్పరం అనుసంధానించిన కథల సంకలనం, కళాత్మక భక్తిని తెలియజేస్తుంది.
నోబెల్ ఫ్రైజ్ ద్వారా 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్ (రూ. 10.3 కోట్లు), బంగారు పతకం, సర్టిఫికేట్ అందుతాయి. ఒకటి కంటే ఎక్కువ మంది విజేతలు గెలిస్తే, బహుమతి డబ్బును వారి మధ్య విభజించుకుంటారు. డిసెంబర్ 10న స్టాక్హోమ్లో అవార్డులను ప్రదానం చేస్తారు. నోబెల్ అకాడమీ ఇప్పటివరకు భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యం, సాహిత్యానికి బహుమతులను ప్రకటించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..