Queen Elizabeth-II: ఎలిజబెత్-2 కు పెళ్లికి నిజాం నవాబు ఇచ్చిన గిఫ్ట్‌ ఇదే.. ఫోటో షేర్‌ చేసిన రాజకుటుంబం

70 ఏళ్లపాటు బ్రిటన్‌ (Britan) రాణిగా కొనసాగిన క్వీన్ ఎలిజబెత్-2 (Queen Elizabeth-II) నిన్న (గురువారం) కన్ను మూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ క్యాజిల్‌లో తుది శ్వాస విడిచారు. బ్రిటన్..

Queen Elizabeth-II: ఎలిజబెత్-2 కు పెళ్లికి నిజాం నవాబు ఇచ్చిన గిఫ్ట్‌ ఇదే.. ఫోటో షేర్‌ చేసిన రాజకుటుంబం
Queen Elizabeth Ii
Follow us

|

Updated on: Sep 09, 2022 | 4:53 PM

70 ఏళ్లపాటు బ్రిటన్‌ (Britan) రాణిగా కొనసాగిన క్వీన్ ఎలిజబెత్-2 (Queen Elizabeth-II) నిన్న (గురువారం) కన్ను మూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ క్యాజిల్‌లో తుది శ్వాస విడిచారు. బ్రిటన్ చరిత్రలో సుదీర్ఘ కాలం మహారాణిగా కొనసాగిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన క్వీన్ ఎలిజబెత్‌-2కు భారత్‌తో మంచి అనుబంధం ఉంది. క్వీన్ ఎలిజబెత్‌-II మూడుసార్లు భారత్‌లో పర్యటించారు. 1961, 1983, 1997 సంవత్సరాల్లో ఆమె ఇండియాకు వచ్చారు. ఈ పర్యటనల్లో భాగంగా క్వీన్ ఎలిజబెత్ ఢిల్లీ, ఆగ్రా, చెన్నై, ముంబై నగరాల్లో పర్యటించారు. ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్ అందాలను వీక్షించి ముగ్ధులయ్యారు. 1947లో క్వీన్ ఎలిజబెత్‌-II వివాహం జరిగింది. ఈ సమయంలో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (Mir Usman Ali Khan) ఖరీదైన వజ్రాలు పొదిగిన ప్లాటినం హారాన్ని వివాహ కానుకగా ఆమెకు బహూకరించారు. అప్పటికే ప్రపంచంలోకెల్లా సంపన్నుడిగా గుర్తింపు పొందిన నిజాం నవాబు తన స్థాయికి తగ్గట్టుగా ఖరీదైన కానుక ఇవ్వాలని భావించారు. ఇందుకోసం లండన్‌కు చెందిన ప్రఖ్యాత ఆభరణాల తయారీ సంస్థ కార్టియర్‌ ప్రతినిధులను క్వీన్ ఎలిజబెత్ వద్దకు నిజాం నవాబ్ పంపించారు. రాణి ఎలిజబెత్ స్వయంగా వివాహ కానుకను సెలక్ట్ చేసుకోవాలని, దానికి అనుగుణంగా ఆభరణాన్ని తయారు చేయాలంటూ సూచించారట. దాంతో ఆమె తనకెంతగానో నచ్చిన ప్లాటినం నక్లెస్‌ను ఎంపిక చేసుకున్నారని రాయల్ ఫ్యామిలీ స్వయంగా వెల్లడించింది.

Queen Elizabeth Ii

Queen Elizabeth Ii

నిజాం నవాబ్ కానుకగా ఇచ్చిన నెక్లెస్‌లో దాదాపు 300 వజ్రాలు పొదిగి ఉండటం విశేషం. 70 ఏళ్ల తన పాలనలో బ్రిటన్ రాణి ఎలిజబెత్ – 2 ఎన్నో విలువైన కానుకలు అందుకున్నారు. వాటన్నింటిలోకి నిజాం నవాబు ఇచ్చింది ప్రత్యేకమైనది అని చెప్పుకోవాలి. రాయల్ జ్యూయలరీ దగ్గరున్న ఆభరణాల్లో ఇదే అత్యంత ఖరీదైనదిగా భావిస్తారు. దీని విలువ 66 మిలియన్ పౌండ్లకుపైగా ఉంటుందని అంచనా. ఎంతో ఇష్టంగా తీసుకున్న ఈ నెక్లెస్‌ను క్వీన్ ఎలిజబెత్ తరచుగా ధరించేవారు. ఈ వజ్రాల నెక్లెస్ ను ధరించిన ఫొటోను ఈ ఏడాది జులై 21న బ్రిటన్ రాజ కుటుంబం అధికారిక ఇన్ స్టా గ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Latest Articles
సమ్మర్‌లో ఏసీ బ్లాస్ట్‌ కాకుండా ఉండాలా?
సమ్మర్‌లో ఏసీ బ్లాస్ట్‌ కాకుండా ఉండాలా?
వృషభ రాశిలో గురువు సంచారం.. ఈ రాశుల వారికి అరుదైన యోగాలు.. !
వృషభ రాశిలో గురువు సంచారం.. ఈ రాశుల వారికి అరుదైన యోగాలు.. !
మిండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదేనా.. లీకైన ఫొటోలు
మిండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదేనా.. లీకైన ఫొటోలు
సబ్బు ఏ రంగులో ఉన్నా.. దాని నురుగు ఎందుకు తెల్లగా ఉంటుందో తెలుసా?
సబ్బు ఏ రంగులో ఉన్నా.. దాని నురుగు ఎందుకు తెల్లగా ఉంటుందో తెలుసా?
అందం అద్దంలో చూస్తే ఈ ముద్దుగుమ్మ రూపమే దర్శనం ఇస్తుందేమో..
అందం అద్దంలో చూస్తే ఈ ముద్దుగుమ్మ రూపమే దర్శనం ఇస్తుందేమో..
కుమారుడు మూగవాడని మొసళ్లున్న కాలువలో....
కుమారుడు మూగవాడని మొసళ్లున్న కాలువలో....
ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత పురుషులు-మహిళల రిలే జట్లు
ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత పురుషులు-మహిళల రిలే జట్లు
ఎందుకు బ్రో అంత కోపం.. ఆవేశం ఆపుకోలేక కారు అద్దం పగలకొట్టిన నటుడు
ఎందుకు బ్రో అంత కోపం.. ఆవేశం ఆపుకోలేక కారు అద్దం పగలకొట్టిన నటుడు
ఇవేం చేస్తాయిలే అనుకునేరు.. రాత్రి భోజనం తర్వాత చిటికెడు తింటే..
ఇవేం చేస్తాయిలే అనుకునేరు.. రాత్రి భోజనం తర్వాత చిటికెడు తింటే..
హిందూ మతంలో ఈశాన్య దిశ ప్రాముఖ్యత ఏమిటి? ఎందుకు పూజ చేస్తారంటే
హిందూ మతంలో ఈశాన్య దిశ ప్రాముఖ్యత ఏమిటి? ఎందుకు పూజ చేస్తారంటే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..