AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నైజీరియాలో మరో కలకలం.. ఏకంగా 400 మంది విద్యార్థులను కిడ్నాప్ చేసిన బండిపోట్లు.. ఆందోళనలో తల్లిదండ్రులు..

నైజీరియాలో మరో దారుణం చోటు చేసుకుంది. ఎప్పుడూ ఏదో ఒక ఘటనతో అట్టుడికే నైజీరియాలో మరోసారి నిషేధిత మిలిటెంట్ల బృందం రెచ్చిపోయింది. ఓ ప్రభుత్వ

నైజీరియాలో మరో కలకలం.. ఏకంగా 400 మంది విద్యార్థులను కిడ్నాప్ చేసిన బండిపోట్లు.. ఆందోళనలో తల్లిదండ్రులు..
Shiva Prajapati
|

Updated on: Dec 14, 2020 | 8:11 AM

Share

నైజీరియాలో మరో దారుణం చోటు చేసుకుంది. ఎప్పుడూ ఏదో ఒక ఘటనతో అట్టుడికే నైజీరియాలో మరోసారి నిషేధిత మిలిటెంట్ల బృందం రెచ్చిపోయింది. ఓ ప్రభుత్వ పాఠశాలపై దాడికి తెగబడి 400 మంది విద్యార్థులను ఎత్తుకెళ్లారు. అపహరణకు గురైన విద్యార్థుల కోసం నైజీరియన్ ఆర్మీ గాలింపు చేపట్టింది. అసలేం జరిగిందంటే.. నైజీరియాలోని కట్సినా రాష్ట్రంలో మారణాయుధాలు కలిగిన మిలిటెంట్లు భారీ సంఖ్యలో వచ్చి ఓ ప్రభుత్వ స్కూల్‌పై దాడి చేశారు. దాదాపు 400 మంది విద్యార్థులను అపహరించుకుపోయారు. స్కూల్‌లో మొత్తం 600 మంది విద్యార్థులు ఉండగా, 200 మంది ఆ బందిపోట్ల నుండి తప్పించుకోగలిగారు. అయితే దీనికి ముందు విషయం తెలుసుకున్న నైజీరియన్ భద్రతా బలగాలు సంబంధిత స్కూల్ వద్దకు చేరుకున్నారు. బందిపోట్లపై ఎదురు దాడి చేశారు. ఈ క్రమంలో 200 మంది విద్యార్థులను వారు రక్షించగలిగారు. మిగతా విద్యార్థులను రక్షించలేకపోయారు. ఇరు పక్షాల దాడులతో ఆ ప్రాంతంలో తీవ్ర భయానక పరిస్థితి ఏర్పడింది. కాగా, మొత్తం మీద ఆ బందీపోట్లు 400 మంది విద్యార్థులను ఎత్తుకుపోవడంతో సదరు విద్యార్థుల తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. తమ పిల్లలను కాపాడాలంటూ భద్రతా బలగాలను వేడుకుంటున్నారు.

ఇదిలాఉండగా.. నైజీరియాలో కొద్దిరోజుల క్రితమే ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. పొలం పనులకు వెళ్లిన రైతులను బోకో హరమ్ మిలిటెంట్లు అతికిరాతకంగా చంపేసిన విషయం తెలిసిందే. ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం 43 మంది రైతుల చేతులు, కాళ్లూ కట్టేసి అతికిరాతంగా గొంతు కోసి చంపేశారు. అదే చోట పనికి వెళ్లిన మరికొంత మంది రైతుల ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. ఈ ఘటన నైజీరియాలోని బోర్నో రాష్ట్రంలో చోటుచేసుకుంది.