
ఇరాక్లోని బాస్రా సమీపంలో జరిగిన డ్రోన్ దాడిలో భారతీయ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని భారత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ కార్యాలయం ధృవీకరించింది. ఖోర్ అల్-జుబైర్ ఓడరేవు సమీపంలో కార్గో లోడింగ్ కార్యకలాపాల సమయంలో మార్షల్ దీవులకు చెందిన జెండా కలిగిన చమురు ట్యాంకర్ MT సేఫ్సీ విష్ణుపై దాడి జరిగింది. పేలుడు పదార్థాలను తీసుకెళ్తున్నట్లు అనుమానించిన తెల్లటి మానవరహిత స్పీడ్బోట్, స్టార్బోర్డ్ వైపు నుండి ఓడను సమీపించి ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ఢీకొనడం వల్ల భారీ పేలుడు, మంటలు చెలరేగాయి. దీంతో ఓడలోని సిబ్బంది అందరూ షిప్పును వదిలివేసి, తమ ప్రాణాలను కాపాడుకోవడానికి సముద్రంలోకి దూకారు. సమీపంలోని STS టగ్ వారిని రక్షించి సురక్షితంగా తీసుకువచ్చింది.
ఇరాకీ కోస్ట్ గార్డ్ మిగిలిన 27 మంది సిబ్బందిని రక్షించింది. వీరిలో 15 మంది భారతీయులు, 12 మంది ఫిలిప్పీన్స్ జాతీయులు ఉన్నారు. ఈ దాడిలో ఓడ అదనపు చీఫ్ ఇంజనీర్ సూపరింటెండెంట్ దేవనందన్ ప్రసాద్ సింగ్ మరణించారు. బీహార్కు చెందిన దేవానందన్ ప్రసాద్ సింగ్.. ముంబైలో ఉంటున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇరాక్ దగ్గర అమెరికన్ ఆయిల్ ట్యాంకర్లకు సంబంధించి చీఫ్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఆ ట్యాంకర్పై దాడి చేయడంతో దేవానందన్ అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాదంలో చిక్కుకున్న వారందరినీ సురక్షితంగా బాస్రా ఓడరేవుకు తరలించారు. అగ్నిమాపక టగ్ నౌకలు సంఘటనా స్థలంలో మోహరించి మంటలను అదుపు చేయడానికి కృషి చేశాయి. ఒక నావికుడు మరణించినట్లు డీజీ-షిప్పింగ్ నిర్ధారించింది. ఓడ కెప్టెన్తో సహా పదిహేను మంది భారతీయులు రక్షించిన వారిలో ఉన్నారు. రక్షించిన వారందరూ సురక్షితంగా ఉన్నారని, ప్రస్తుతం బాస్రా సమీపంలోని ఒక చిన్న ద్వీపంలో ఉన్నారని సమాచారం. బాగ్దాద్లోని భారత రాయబార కార్యాలయం ఇరాక్ అధికారులతో నిరంతరం సంప్రదిస్తోంది. ఇందులో పాల్గొన్న భారతీయ పౌరుల శ్రేయస్సు దృష్ట్యా అవసరమైన సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
The Directorate General of Shipping, Government of India, is closely monitoring the incident involving oil tanker MT SAFESEA VISHNU near Basra. All crew members were rescued, while one Indian seafarer tragically lost his life. Authorities are coordinating with relevant agencies… pic.twitter.com/6U5JTQx096
— Directorate General of Shipping, Govt. of India (@dgshipping_IN) March 12, 2026
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..